మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. `అల‌వైకుంఠ‌పురంలో ` హిట్ త‌ర్వాత మంచి జోష్ మీదున్న త్రివిక్ర‌మ్ ఈ సినిమాని ఎంత త్వ‌ర‌గా సెట్స్ మీద‌కి తీసుకువెళ్ళాలా అన్న‌ట్లు ఉన్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌తో క‌లిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌, ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం 120 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ మ‌ధ్య కాలంలో సినిమాలో స్ట‌ఫ్ ఎంత ఉంది. క‌థ ఎలా ఉంది అని ఎవ్వ‌రూ ఆలోచించ‌డంలేదు. దానికంటే ముందు ఎంత బ‌డ్జెట్‌తో సినిమాని నిర్మిస్తున్నారు అన్న విష‌యం పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. ఈ మ‌ధ్య‌కాలం ప‌రిస్థితులు అలా మారిపోయాయి. దానికి కూడా ఒక ప్ర‌త్యేక కార‌ణం ఉంది. ఈ త‌ర‌హా ప‌ద్ధ‌తి `బాహుబ‌లి` చిత్రం విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఉంది. 

 

సినిమా బ‌డ్జెట్‌లో హీరో ఎన్టీఆర్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ల‌కే దాదాపుగా 60 కోట్లు ఇవ్వ‌బోతున్నార‌ట‌. అంటే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్‌ల‌కి, ప్రొడ‌క్ష‌న్‌కి క‌ల‌పి 60 అవుతుంద‌న్న‌మాట‌. ఈ వార్త‌ ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో హల్‌చ‌ల్ చేస్తోంది. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` భారీ విజ‌యాన్ని సాధించి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌వ‌డంతో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో మాట‌ల మాంత్రికుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి ప్లాన్‌లు వేస్తున్నార‌ట‌.

 

ఇక ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య హీరోల రెమ్యూన‌రేష‌న్ల‌కంటే కూడా వాళ్ళు ఎక్కువ‌గా సినిమా డిజిట‌ల్ రైట్స్‌, ఏరియా రైట్స్ ఇలా తీసేసుకుంటున్నారు. దాని వ‌ల్ల కాస్త నిర్మాత కూడా న‌ష్ట‌పోతున్నాడు. మ‌రి అలాంటి క‌ల్చ‌ర్‌ని ముందుగా స్టార్ట్ చేసింది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు దాంతో మిగ‌తా హీరోలు కూడా దాదాపు అదే ప‌నిలో ప‌డ్డార‌ని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: