కొందరు హీరోయిన్స్ అప్పుడప్పుడు ఏం మాట్లాడుతారో అర్ధం కాదు.. అసలు సంబంధం లేని విషయాల్లో వెలుపెట్టి అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటారు.. ఇదంతా నోటి దురుసు అంటారట.. ఇకపోతే తాజాగా ఓ బాలీవుడ్ నటి పలు సంచలన వాఖ్యలు చేసి, ట్రోల్ అవుతుంది.. ఈ నటి పేరు నేహా దుపియా.. ఈ నటి తెలుగులో రెండే సినిమాలు చేసింది అందుకే తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తు ఉండదు.. అదే బాలీవుడ్‌లో అయితే తన అందచందాలతో, సెక్సీ ఎక్స్‌పోజింగ్‌లతో ఒక ఊపు ఊపింది.. ఇక ఈ భామ 2002లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో ఆమెకు బాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టాయి.

 

 

ఈ క్రమంలోనే 2003లో ‘ఖయామత్’ సినిమాతో అజయ్ దేవ్‌గణ్ తో జోడికట్టి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నేహా అందాల ఆరబోతకు స్క్రీన్ వేడెక్కింది. ఆ తర్వాత (2004) లో, జూలీ  సినిమాతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. ఇక చూపింది చాలనుకున్నారేమో ప్రేక్షకులు, నిర్మాతలు.. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.. ఈ దశలో పెళ్లివైపు అడుగులు వేసి అంగద్ బేడిని పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుండి షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తుంది నేహా దుపియా..

 

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం రోడీస్ రెవల్యూషన్ అనే ప్రోగ్రామ్‌కు టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్న నేహా, ఈ  ప్రోగ్రామ్‌లో చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతుంది.. అదేమంటే ఈ షోలో పాల్గొన్న ఒక కంటెంస్ట్‌ తన బాధను చెబుతూ, తాను ప్రేమించిన అమ్మాయి..తనతో పాటు మరో ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్‌ ‌తో డేటింగ్ చేస్తూ తనను ఛీట్ చేసిందని తెలియడంతో ఆమెపై కోపమొచ్చి లాగి ఓ చెంప దెబ్బకొట్టాను అని తన బాధను వెల్లబోసుకున్నాడు.

 

 

దానికి టీమ్ లీడర్‌గా ఉన్న నేహా దుపియా ఆమెను నువ్వు కొట్టడం తప్పు.. ఆమె ఎంత మందితో తిరిగితే నీకేంటి.. డేటింగ్ చేస్తే నీకెంటి.. అది ఆమెకున్న స్వేచ్ఛ.. ఆమె స్వేచ్ఛను  ప్రశ్నించడానికి నీవెవరు అంటూ కామెంట్ చేసింది. ఇక ప్రస్తుతం నేహా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎద్దున ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు అనరాని మాటలతో విరుచుకుపడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: