టాలీవుడ్‌ స్టార్ యాంకర్‌గా ఓ ఊపు ఊపేసింది ఝాన్సీ. బుల్లితెర మీద సత్తా చాటడమే కాదు వెండితెర పై కూడా పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. కెరీర్‌ ఫుల్‌ ఫాంలో ఉండగానే తోటి యాంకర్‌ జోగి నాయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దలకు ఇష్టం లేకపోయినా ఎదిరించి మరి పెళ్లిచేసుకుంది. అయితే కొంత కాలం బాగానే సాగిని వీరి వైవాహిక జీవితంలో తరువాత ఇబ్బందులు ఎదురయ్యాయి. మనస్పర్ధలతో ఇద్దరు విడిపోయారు. కెరీర్‌ పరంగా వచ్చిన సమస్యల కారణంగానే వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు వచ్చాయని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు జోగి నాయుడు. 


ఝాన్సీ .. జోగినాయుడు ఇద్దరూ కూడా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ తరువాత వెండితెరకి వెళ్లినవారే. కెరియర్ ఆరంభంలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ, ఆ తరువాత కాలంలో విడిపోయారు. అయితే వారెందుకు విడిపోయారన్నది మాత్రం అతి కొద్ది మందికే తెలుసు. ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య వివాదం గురించి జోగినాయుడు మాట్లాడుతూ, `ఝాన్సీ .. నేను, ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. 8 సంవత్సరాల పాటు మా వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఎప్పుడైతే సరదాలు .. విలాసాల విషయంలో ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడతామో, అప్పుడే జీవితం నాశనమవుతుంది. ఇలాంటి అంశాలు మా మధ్య చోటుచేసుకోవడం వల్లనే గొడవలు మొదలయ్యాయి. ఆమె నా నుంచి విడిపోవడానికి కారణం ఆర్ధికపరమైన విషయాలే. ఆమె కోసం 8 సంవత్సరాలు ఎదురుచూసి, ఆ తరువాతే మరో పెళ్లి చేసుకున్నాను` అని చెప్పుకొచ్చాడు జోగి నాయుడు.

 

అయితే ఈ విషయంలో ఝాన్సీ వాదన మరోలా ఉంది. తన జోగినాయుడు తనను మానసికంగా ఇబ్బంది పెట్టేవాడని అందుకే తనతో కలిసి జీవితాన్ని కొనసాగించలేకపోయానని పలు సందర్భాల్లో వివరించింది ఝాన్సీ. అంతేకాదు విడాకుల విషయంలో కూడా జోగినాయుడు ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: