మెగా మేనళ్లుడు సాయి తేజ్ చిత్రలహరి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ సినిమా హిట్ అవడమే కాకుండా రీసెంట్ గా వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమా కూడా సూపర్ హిట్ అయింది. రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. ఆల్రెడీ థియేట్రికల్ బిజినెస్ డీల్ జరుగుతుందటా లేటెస్ట్ గా సినిమా శాటిలైట్ రైట్స్ కోసం భారీ ఆఫర్ వచ్చిందట.

 

లీడింగ్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా శాటిలైట్ రైట్స్ ను 10 కోట్లకు కొన్నారట. సాయి తేజ్ కెరియర్ లో ఇదే హయ్యెస్ట్ అని తెలుస్తుంది. చిత్రలహరి పర్వాలేదు అనిపించినా ప్రతిరోజూ పండుగే సినిమా మాత్రం నిర్మాతకు మంచి లాభాలు తెచ్చింది. సుప్రీమ్ తర్వాత వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కున్న సాయి తేజ్ కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా రిలీజ్ కాకుండానే దేవా కట్టా డైరక్షన్ లో ఓ సినిమా ముహూర్తం పెట్టుకున్నాడు సాయి తేజ్.

 

ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు చిత్రలహరి సినిమాకు పనిచేశారు. ఈమధ్య వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో కూడా నివేదా పేతురాజ్ నటించింది. మెగా హీరోలతో ఒక సినిమా చేసి హిట్ కొడితే అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చినట్టే. మెగా మేనళ్లుడు సాయి తేజ్ తో నివేదా మళ్ళీ జోడీ కడుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: