ప్రస్తుతం బుల్లితెర తెరపై సందడి చేస్తున్న యాంకర్లు చాలా మంది ఉన్నప్పటికీ అందులో ప్రేక్షకులకు దగ్గరైన మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే. ఇలా ప్రేక్షకులకు దగ్గరైన చాలా తక్కువ మంది యాంకర్లలో ఒకరు యాంకర్ అనసూయ. అప్పుడు వరకు బుల్లితెర ప్రేక్షకులకు కొంత మందికి మాత్రమే తెలిసిన అనసూయ ఆ తర్వాత టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేసి మొత్తం తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరెట్ యాంకర్ గా మారిపోయింది. ప్రస్తుతం యాంకర్ అనసూయకి  బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతగానో క్రేజ్ సంపాదించిన అనసూయ... పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా... ప్రొఫెషనల్ గా దూసుకుపోతుంది. 

 

 

ఓవైపు బుల్లితెరపై వివిధ ప్రోగ్రాములు చేస్తూనే మరోవైపు వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ అనసూయ రంగమ్మత్త గా మారిపోయిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో కీలకపాత్ర ఆయన రంగమ్మత్త పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. దీంతో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ రంగమ్మత్త గా మారిపోయింది అనసూయ. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో ఎన్నో కీలక పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. 

 

 

 అయితే అనసూయ సుశాంత్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి తొమ్మిదేళ్లపాటు ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో హాజరైన సమయంలో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది  అనసూయ. తనకు సుశాంత్ భరద్వాజ్ రెండవ భర్త అని... తన మొదటి భర్త తన వర్క్  అంటూ చెప్పుకొచ్చింది. తనకు ఏదైనా వర్క్ ఇచ్చారు అంటే అది కంప్లీట్ చేసేంతవరకూ తనకు మనశ్శాంతి ఉండదు అంటూ చెప్పుకొచ్చింది. వర్క్ తర్వాతే ఎవరినైనా పట్టించుకుంటాను  అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: