ప్రస్తుతం బుల్లితెర పై బాగా పేరు తెచ్చుకుని అటు వెండి తెరపై కూడా వెలిగిపోతున్న యాంకర్ లలో ఒకరు అనసూయ. బుల్లి తెర పై ప్రేక్షకులకు దగ్గరైన చాలా తక్కువ మంది యాంకర్లలో ఒకరు యాంకర్ అనసూయ. అప్పుడు వరకు బుల్లితెర ప్రేక్షకులకు కొంత మందికి మాత్రమే తెలిసిన అనసూయ ఆ తర్వాత టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేసి మొత్తం తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరెట్ యాంకర్ గా మారిపోయింది. ప్రస్తుతం యాంకర్ అనసూయకి  బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతగానో క్రేజ్ సంపాదించిన అనసూయ... ఇక ఎన్నో ప్రోగ్రాములు చేసుకుంటూ దూసుకుపోతోంది.

 

 

 అయితే ఈ అమ్మడికి అటు వెండి తెరపై కూడా ఎంతో క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఓవైపు బుల్లితెరపై అదరగొడుతునే..  మరోవైపు వెండితెరపై కూడా పలు కీలక పాత్రల్లో నటిస్తూ తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమత్త పాత్ర అనసూయకు  మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఇక అంతకు ముందు వచ్చిన క్షణ క్షణం సినిమా కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చింది. అంతేకాదండోయ్ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఏకంగా  ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తుంది ఈ అమ్మడు. మెగాహీరో సాయిధరమ్ తేజ్  హీరోగా నటించిన విన్నర్ సినిమాలో  సూయ  సూయ  అనే ఐటెం సాంగులో డాన్సులతో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ.

 

 

 ఇక ప్రస్తుతం వెండితెర అయినా బుల్లితెర అయినా  తనకు తిరుగు లేదు అంటూ నిరూపిస్తోంది. అయితే జబర్దస్త్ షో ద్వారా అనసూయ నక్కతోక తొక్కినది  అనే చెప్పాలి. జబర్దస్త్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు అనసూయ. అయితే జబర్దస్త్ షో కి రాకముందు ఓ న్యూస్ ఛానల్ న్యూస్ రీడర్ గా  పని చేసేది అనసూయ. ఇక అసలు మీడియా లోకి రాకముందు ఓ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసేదట అనసూయ. ఎంబీఏ పూర్తి చేసిన అనసూయ ఓ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో చేసి...  ఆ తర్వాత న్యూస్ ఛానల్ లో కి న్యూస్ రీడర్గా ఎంటర్ అయ్యింది. ఇక ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం వచ్చి అనసూయ అదృష్టం మొత్తం మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: