అనసూయ విశాఖపట్నానికి చెందినది. ఈమె తెలుగు ప్రేక్షకులకి దగ్గరయింది. టీవి యాంకరుగా ఈమె చేస్తూ కొన్ని సినిమాలలో కూడా అవకాశం వినియోగించుకుని పలు సినిమాలలో నటించింది అనసూయ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమత్త పాత్రలో అనసూయ అద్భుతంగా నటించింది. అనేక షోస్లో అనసూయ తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదట సాక్షి టీవిలో ఆమె న్యూస్ ప్రెసెంటేటర్గా పని చేసింది. ఆ తర్వాత జబర్దదస్త్లో యాంకర్గా సెట్ అయ్యిపోయింది.

 

IHG

 

ఆమె కెరీర్ని ఈ షో మలుపు తిప్పింది. ఊహించని అంత రెస్పాన్స్ వచ్చింది. ఆమె తక్కువ సమయంలోనే ఫేమస్ అయిపొయింది. మంచి షోస్తో, వివిధ ఆడియో ఫంక్షన్ వంటివి తర్వాత ఎన్నో చేసింది. హీరో అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో అనసూయ చిన్న  పాత్ర చేసింది. ఆ తర్వాత క్షణం సినిమాలో కూడా అనసూయ నటించింది. ఆ సినిమా యాంకర్ అనసూయకి మంచి పేరు తెచ్చింది.

 

ఎన్నో ఫంక్షన్స్ లో అనసూయ హోస్ట్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ US కాన్సర్ట్లో ఆమె హోస్ట్ చేసింది. అలానే ఎన్నో వాటికి అనసూయ వెళ్ళి యాంకరింగ్ చెయ్యడం జరిగింది. నాగ, సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్, గాయత్రి, రంగస్థలం, ఎఫ్ 2 , సచ్చిందిరే గొర్రి, యాత్ర, మీకు మాత్రమే చెప్తా ఇలా అనేక సినిమాలలో నటించింది అనసూయ.

 

IHG

 

చక్కటి యాంకరింగ్తో, మంచి టైమింగ్తో ఈ  బ్యూటీ యాంకర్ నవ్వుతు నవ్విస్తుంది. ఆమె మాటలకి ఫిదా అవ్వాల్సిందే. ఇలా యాంకర్ అనసూయ తన జీవితంలో అనేక మలుపులని చూస్తూ వచ్చింది. జీవితంలో ఒక్కోసారి వస్తున్నా ఛాన్స్ని వినియోగించుకుంటూ కష్టపడుతూ వచ్చింది ఈ యాంకర్. ఇలా ఆమె ఎన్నో వాటికి అనసూయ వెళ్ళి యాంకరింగ్ చెయ్యడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: