యాంకరింగ్ అంటే మాటల్లో ఎంత చాతుర్యం చూపించాలో.. హావభావాల్లోనూ అంతే నేర్పరి అయి ఉండాలి. వీటన్నింటినీ పుష్కలంగా పుణికిపుచ్చుకున్నారు అనసూయ, రష్మి. తెలుగులో యాంకర్లుగా నేటి జనరేషన్ లో శెభాష్ అనిపించుకుంటున్నారు. ఓ కార్యక్రమానికి దాదాపు ఎనిమిదేళ్లుగా వీరిద్దరే మహారాణుల్లా ఏలడం నిజంగా గర్వించదగ్గ విషయమే. తెలుగులో ఎంతో పాపులర్ అయిన జబర్దస్త్ ప్రోగ్రామ్ కు వీరిద్దరూ తమ యాంకరింగ్ తో ఎంతో కలర్ తీసుకొచ్చారు. వీరిద్దరూ లేని జబర్దస్త్ ను ఊహించుకోవడమే కష్టం అన్నట్టు వీరి ప్రస్థానం కొనసాగుతోంది.

 

 

జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ తమ గ్లామర్ తో, యాక్టింగ్ తో, మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటున్నారు. మధ్య మధ్యలో పార్టిసిపెంట్లు చేసే స్కిట్లలో వీరి ప్రస్తావన వస్తే అప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూ చాకచక్యంతో మాట్లాడటం వీరి స్పెషల్. కార్యక్రమం మధ్యలో అనర్గళంగా మాట్లాడుతూ షోను రక్తి కట్టిస్తూ వీరి యాంకరింగ్ కొనసాగుతోంది. ప్రేక్షకులకు ఈ ప్రోగ్రామ్ పై బోర్ కొట్టకపోవడంలో వీరి పాత్ర కూడా ఎంతో ఉంది. వీరిద్దరూ ఈ జబర్దస్త్ లో రాణిస్తూండటంతో ప్రేక్షకులకు చేరువయ్యారు. దీంతో వీరిని వెతుక్కుంటూ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.. వస్తున్నాయి. అనసూయ క్షణం, రంగస్థలం.. వంటి సినిమాల్లో నటించింది. రంగస్థలంలో అనసూయ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

 

 

రష్మీ కూడా పలు సినిమాల్లో నటించింది. ఆమె నటించిన గుంటూరు టాకీస్ హిట్ అవడమే కాకుండా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో వీరిరువురూ టెలివిజన్, సినిమా రంగాల్లో రాణిస్తున్నారు. సినిమా వేడుకలకు వీరి యాంకరింగ్ తక్కువే అయినా పలు ఈవెంట్లలో తమ మాటల తూటాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ తీసుకొచ్చిన ఫేమ్ తో వీరి ఫేట్ మారిందనే చెప్పాలి. దాదాపు ఎనిమిదేళ్లుగా అక్కడ వీరిద్దరిదే హవా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: