టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యాంకర్స్ లో అనసూయ ఒకరు. ఆమె వరుసగా టీవీ షోస్ చేస్తూ సీనియర్ యాంకర్లకు కూడా షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా నిలబడిన వారికి కూడా ఆమె దూకుడు ఇబ్బందిగా మారింది. జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా ఆమె పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుస అవకాశాలు వస్తున్న సమయంలో ఆమె సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది అనేది వాస్తవం. ఆమెకు వచ్చిన సినిమా ఆఫర్లు ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి రాలేదు అనే చెప్పాలి. దర్శక నిర్మాతలకు ఆమెది గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా ఉంది. 

 

ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. రంగస్థలం సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. దీనితో అనసూయ ఇప్పుడు సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపించడం తో ఈ యాంకర్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఆమెకు గ్లామర్ కూడా ఎక్కువే. అందుకే త్వరలో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పి సినిమాల్లో లేడీ విలన్ పాత్రలతో పాటుగా, అత్తగా అమ్మగా నటించాలని భావిస్తుంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు కూడా ఆమెను సంప్రదించారు. 

 

త్వరలోనే అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాలీవుడ్ జనం అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె మాత్రం ఇటీవల కొందరు దర్శకులను కూడా కలిసి ఇదే విషయాన్ని వారి ముందు ఉంచినట్టు తెలుస్తుంది. త్వరలో రాబోయే నితిన్ సినిమాలో ఆమె విలన్ పాత్ర చేస్తారని, బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో చేసే సినిమాలో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రను చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: