మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న 152వ మూవీ ఆచార్య షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ కోసం మహేశ్ దాదాపు కన్ఫర్మ్ అయ్యేలా ఉన్నా టీమ్ మాత్రం ఏ న్యూస్ ను రివీల్ చేయలేకపోతోంది. అలాగే.. సినిమాలో హీరోయిన్ విషయం కూడా ఇంతవరకూ కన్ఫర్మ్ చేయటం లేదు. ఇప్పుడీ సినిమాకు మొదటి షాక్ హీరోయిన్ రూపంలో తగిలింది. త్రిష ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి.

 

 

షూటింగ్ కీలక దశలో ఉండగా.. హీరోయిన్ జాయిన్ కావాల్సిన షెడ్యూల్ దగ్గరపడుతున్న సమయంలో ఈ వార్త ఫిలింనగర్ లో చర్చనీయాంశంగా మారింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే హీరోయిన్ తో పోలిస్తే తన పాత్ర తక్కువగా ఉందనే కారణంతో త్రిష ఈ ప్రాజెక్టును వద్దనుకుందని అంటున్నారు. చెన్నై ఫిలిం సర్కిల్స్ లో కూడా ఇదే వార్త రౌండ్ అవుతోంది. త్రిష మెయిన్ లీడ్ హీరోయిన్ అని ప్రకటించినా ఇంతవరకూ ఎటువంటి క్లారిటీ లేదు. వెంటనే కార్యరంగంలోకి దిగిన కొరటాల శివ కాజల్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఖైదీ నెం 150లో మెగాస్టార్ తో ఆడిపాడింది కాజల్. ఇదే నిజమైతే ఆఫర్లు తక్కువైన కాజల్ కు ఇది బంపర్ ఆఫరే.

 

 

చిరంజీవి సినిమాకు నో చెప్పి త్రిష తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. తెలుగులో పూర్తిగా ఫేడ్ అవుట్ అయిన త్రిషకు పిలిచి మెగాస్టార్ సినిమాలో అవకాశం ఇస్తే కాదనుకోవడం తగని పని అంటున్నారు. గత ఏడాది రజినీకాంత్ పెటాలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పావుగంట పాత్ర పోషించిన త్రిషకు చిరంజీవి సినిమాలో లీడ్ పాత్ర వద్దనుకోవడం విచిత్రమే. దీనిపై అఫిషియల్ న్యూస్ ను ఆచార్య టీమ్ రివీల్ చేయాల్సిందే.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: