పెళ్లి చూపులు సినిమాతో న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీని పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్  ఆ సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. పెళ్లి చుపులు సినిమాలోని మాటలకి అతడికి జాతీయ అవార్డు వచ్చింది. పెళ్లి చూపులు ఘన విజయం సాధించడంతో డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ సెటిల్ అయిపోయినట్టే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తన రెండవ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో   ఈ నగరానికి ఏమైంది అనే సినిమా తీసాడు. ఈ చిత్రం యూత్ ని బాగానే ఆకట్టుకుంది.

 

అయితే ఈ నగరానికి ఏమైంది తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు తరుణ్ దర్శకత్వంలో సినిమా రాలేదు. కనీసం ఎవరితో సినిమా అన్న విషయం కన్ఫర్మ్ కూడా కాలేదు. విక్టరీ వెంకటేష్ తో హార్స్ రేసింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ, ఆ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేసిన తరుణ్ యాక్టర్ గా మారిపోయాడు. ఫలక్ నుమా దాస్ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించాడు.

 

అయితే అదేదో స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి చేశాడని అనుకున్నారు. అలా అనుకునే లోపే తరుణ్ హీరోగా మీకు మాత్రమే చెప్తా సినిమా చేశాడు. ఈ సినిమాలో మాటలు తనే రాశాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమా హిట్ అయితే గనక తరుణ్ కి హీరోగా అవకాశాలు వచ్చేవే. కానీ అలా కాకపోవడంతో అవకాశాలు రాలేదు.

 

దాంతో మళ్లీ దర్శకత్వం వైపుకు వస్తాడని అనుకున్నారు. కానీ సడెన్ గా మళ్లీ మరో కొత్త అవతారం ఎత్తుతున్నాడు తరుణ్. నీకు మాత్రమే చెప్తా అనే ఒక టీవీ ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈటీవీ ప్లస్ లో ప్రసారం కాబోతున్న ‘నీకు మాత్రమే చెప్తా’ టాక్ షో ద్వారా పలువురు దర్శకుల మనో భావాలు.. వారు సినిమాలు తీస్తున్న సమయంలో పడ్డ కష్టాలు ఎదుర్కొన్న అనుభవాలు హీరోల నుండి వచ్చే అనుభవాలు.. నిర్మాతల నుండి ఎదుర్కొనే సవాళ్లను ఈ షో ద్వారా దర్శకులతో చెప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడిగా సక్సెస్ ని చూసిన తరుణ్ వ్యాఖ్యాతగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: