అక్కినేని తండ్రీకొడుకులు ధియేటర్ల మీద దాడిచెయ్యబోతున్నారు.  అటూ ఇటూ గా అక్కినేని హీరోల ముగ్గురి సినిమాలు ఒకే సీజన్  లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ముగ్గురు అక్కినేని అందగాళ్లు  డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలతో తమ స్టైల్లో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. వీళ్లలో ఎవరు ముందొస్తున్నారో ..రిలీజ్ లు ఎలా ప్లాన్ చేసుకున్నారో చూద్దాం. 

 

తండ్రీ కొడుకుల మధ్య సమ్మర్ లో బిగ్ ఫైట్ జరగబోతోంది. అక్కినేని నాగార్జున .. తన కొడుకులతో  ఫైటింగ్ కి రెడీ అయ్యాడు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాలు సమ్మర్లోనే రిలీజ్ అవ్వబోతున్నాయి. మూడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు ఈ ముగ్గురూ. అందులో సీనియర్ అయిన నాగార్జున అంతకుముందు చేసిన కంప్లీట్ రొమాంటిక్ మూవీ మన్మధుడు 2కి క్వైట్ ఆపోజిట్ గా యాక్షన్ ఫిల్మ్ వైల్డ్ డాగ్ చేస్తున్నాడు. షూటింగ్ ఫాస్ట్ గా జరుపుకుంటున్న ఈ సినిమాని మేలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున.

 

పెద్ద కొడుకు నాగచైతన్య.. లాస్ట్ ఇయర్ మజిలీ తో మంచి హిట్ కొట్టాడు. తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని శేఖర్ కమ్ములతో సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 2 న రిలీజ్ అని డేట్ అనౌన్స్ చేశారు. కానీ అదే రోజు అరణ్య, జేమ్స్ బాండ్, నిశ్శబ్దం సినిమాల రిలీజ్ ఉండడంతో  మే కి పోస్ట్ పోన్ చేసే ఛాన్సుందని టాక్. 

 

నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఈ సారి హిట్ కోసం థియేటర్ల మీద దండయాత్రకు రెడీ అవుతున్నాడు . ముచ్చటగా మూడు సినిమాలు చేసినా మినిమమ్ సక్సెస్ కూడ కొట్టలేకపోవడంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే బొమ్మరిల్లు భాస్కర్ తో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమా మే లో రిలీజ్  అవుతోంది. ఇలా తండ్రీకొడుకులు ముగ్గురూ సమ్మర్ నే టార్గెట్ చేసి మాకు మేమే పోటీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: