ఇటీవల యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, అతి త్వరలో మెగాస్టార్, కొరటాల శివ సినిమాతో పాటు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. అతి త్వరలో తన ఫ్యామిలీతో కలిసి హిమాలయాలకు వెళ్లివచ్చిన అనంతరం ఈ సినిమా షూటింగ్ లో మహేష్ పాల్గొననున్నారట. పరశురామ్ మహేష్ కు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించారని, తన కెరీర్ లో మహేష్ ఇటువంటి రోల్ ఇప్పటివరకు చేయలేదని, అలానే ఆ పాత్ర కోసం మహేష్ ఇప్పటినుండే తనను తాను సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. 

 

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, రెండు రోజుల క్రితం నుండి రామోజీ ఫిలిం సిటీ లో ఒక కీలక సెట్టింగ్ ని ఈ సినిమా యూనిట్ ప్రారంభించిందని, దాదాపుగా రూ.3 కోట్ల రూపాయల ఈ సెట్టింగ్ ని ఎంతో గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ఇందులో చిత్రీకరించనున్నట్లు టాక్. మహేష్ సరసన ఒక స్టార్ హీరోయిన్ నటించనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ లెవెల్లో నిర్మించనున్నారని అంటున్నారు. 

 

ముందుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయాల్సి ఉండగా, ఆయన కథ తాలుకు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడం, సరిగ్గా అదే సమయంలో మంచి స్టోరీ లైన్ తో పరశురామ్ మహేష్ ని కలవడంతో ఈ ప్రాజక్ట్ కు గ్రీన్ సిగ్నల్ లభించిందని తెలుస్తోంది. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక చిన్న మెసేజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందొ తెలియదుగాని, దీనికి సంబందించిన అధికారిక ప్రకటన మాత్రం ఉగాది పండుగ రోజున రానున్నట్లు తెలుస్తోంది. అప్పుడే సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయట....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: