ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీనితో రాజమౌళి ఈ సినిమాను వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ ని ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. 

 

దాదాపు ఇప్పటికే ఫస్ట్ లుక్ దాదాపుగా రెడీ అయిందని అంటున్నారు. ముందు ఇద్దరు హీరోల లుక్ ని బ్యాక్ నుంచి చూపించి, ఆ తర్వాత 28 న రామ్ చరణ్ పుట్టిన రోజు ఉంది కాబట్టి ఆ రోజున... ఆయన లుక్ ని ఫ్రంట్ నుంచి విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట రాజమౌళి. ఇక చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. షూటింగ్ స్పాట్ లో ఒకరు చేసిన పనికి రాజమౌళికి చిరాకు వచ్చింది అంటున్నారు. 

 

లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు రాజమౌళి. అయినా సరే అక్కడ పని చేసే ఒక వ్యక్తి రామ్ చరణ్ సీన్ ని షూట్ చేసే సమయంలో తన ఫోన్ లో షూట్ చేస్తున్నారని గుర్తించిన రాజమౌళి అతని నుంచి ఫోన్ లాక్కుని అక్కడి నుంచి పంపించారట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. అతన్ని షూటింగ్ కి కూడా రావొద్దని చెప్పెసారట రాజమౌళి. కాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: