టాలీవుడ్ లో ఈ మధ్య స్టార్ హీరోల మార్కెట్ భారీగా పెరిగింది అనే విషయం అందరికి తెలిసిందే. వారి సినిమాలు అనగానే భారీ వసూళ్లు అనే పేరు కూడా ఉంటుంది. దీనితో వారితో సినిమా చేయడానికి ఎందరో నిర్మాతలు ముందుకి వస్తూ ఉంటారు. అలాంటి నిర్మాతలు ఇప్పుడు హీరోల భార్యల కారణంగా భయపడుతున్నట్టు సమాచారం. మహేష్ బాబు భార్య నమ్రత విషయంలో కాస్త అసహనం నిర్మాతలు వ్యక్తం చేసారు అనే ప్రచారం జరిగింది అప్పట్లో. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్ లో హడావుడి చేసారు. 

 

ఇక మరికొంత మంది హీరోల భార్యలు కూడా స్టార్ హీరోల సినిమాల విషయంలో కాస్త ఎక్కువగా జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. టాలీవుడ్ లో మార్కెట్ పెరిగింది కాబట్టి హీరోలు కూడా నిర్మాతలుగా మారే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్య. దీనితో భార్యలు కథ వినడం, ఆ కథలకు మార్పులు చేర్పులు చెప్పడం, తమకు నచ్చిన విధంగా కథను మార్చుకునే ప్రయత్నం వంటివి ఎక్కువగా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో నాగ చైతన్య సినిమాల విషయంలో సమంతా పెద్దగా జోక్యం చేసుకునేది కాదు. 

 

కాని ఇప్పుడు మాత్రం ఆమె జోక్యం ఎక్కువగా ఉందని అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, రామ్ చరణ్ భార్య ఉపాసనా సహా కొందరి భార్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా హడావుడి చేస్తున్నారు. కథలు వినడం దర్శకులతో ఎక్కువగా చర్చలు జరపడం వంటివి ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. దీనితో దర్శకులు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. నిర్మాతలు కూడా ఈ విషయంలో కాస్త ఆగ్రహంగా ఉన్నారని టాక్. మరి ఈ పరిస్థితి ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: