టాలీవుడ్ మాస్ మహరాజ  రవితేజ ఆ మద్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత రవితేజ బ్యాడ్ టైమ్ మొదలైందనే చెప్పాలి.  వరుసగా నాలుగు డిజాస్టర్స్ తో ఎంతో ఇబ్బంది పడుతన్నాడు.  విఐ ఆనంద్ దర్శకత్వంలో కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ‘డిస్కోరాజా’ కూడా ఫ్లాప్ కావడంతో ఆలోచనలో పడ్డారు.  దాంతో గతంలో తనకు మంచి హిట్ ఇచ్చిన దర్శకులతోనే సినిమాలు తీయాలనే ఆలోచనలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో ‘బలుపు’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే... ఈ మూవీ దర్శకుడు గోపిచంద్ మలినేని తో ఓ మూవీకి కమిట్ అయ్యారు.  అంతే కాదు ఇందులో నటించిన హీరోయిన్ శృతిహాసన్ జోడీగా నటిస్తుంది.  

 

మొత్తానికి బలుపు కాంబినేషన్ మొత్తం ఇప్పుడు ‘క్రాక్’ తో రాబోతుంది.  దాంతో మాస్ రాజా అభిమానులు కూడా మంచి సంతోషంలో ఉన్నారు.  ఈ మూవీ తర్వాత రవితేజ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. స్టార్ రైటర్ గా ఎన్నో హిట్ సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేసేందుకు మాస్ రాజా ఓకే చెప్పారని సమాచారం. వక్కంతం వంశీ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' సినిమాతో డైరెక్టర్ గా మారారు కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.  

 

దాంతో మంచి హిట్ కట్టాలనే ఉద్దేశంతో చాలా సమయం తీసుకొని ఓ కథపై ఫోకస్ పెట్టారట. యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో తయారు చేసినఈ కథనే మాస్ రాజాకు వినిపించడం.. ఆయనకు నచ్చడం తో ప్రాజెక్ట్ ఒకే అయిందని సమాచారం. గతంలో రవితేజ నటించిన హిట్ సినిమాలకు వక్కంతం రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: