మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది యువ హీరోలకు  ఇన్స్పిరేషన్ అని చెప్పాలి.ప్రస్తుతం  టాలీవుడ్ పెద్దగా కొనసాగుతున్నారు చిరంజీవి. ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవిసినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కొరటాల శివ టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతూ దూసుకుపోతున్నారు . ఈ నేపథ్యంలో కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

 

 

 

 అయితే కొరటాల శివ మెగాస్టార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో  హీరోయిన్ గా ఎంపికైన త్రిష తాజాగా ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా త్రిష ఈ విషయాన్ని ప్రకటించింది. కొన్ని భిన్న అభిప్రాయాలు కారణంగా చిరు సర్  సినిమా నుంచి తప్పుకుంటున్న  అంటూ చెప్పుకొచ్చింది త్రిష. ఇక మరో ప్రాజెక్టు తో ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. 

 

 

 ఈ నేపథ్యంలో ప్రస్తుతం త్రిష తప్పుకుంటుంది అని ప్రకటించగానే ఆచార్య సినిమాకు సంబంధించి అభిమానుల్లో  సరికొత్త ప్రశ్న మొదలైంది. చిరంజీవి సరసన నటించేందుకు చిత్ర బృందం ఎవరిని తీసుకుంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం త్రిషసినిమా నుంచి తప్పుకోవడంతో చిత్ర బృందం చూపు మొత్తం నయనతార వైపు ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న నయనతార చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం సీనియర్ హీరోలకు  కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది నయనతార. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సరసన నయనతారను తీసుకుంటారు అని ప్రచారం మొదలైంది. మరి విచిత్రబంధం సినిమాలో త్రిష స్థానంలో ఎవరిని తీసుకోబోతున్నారు అనేది చూడాలి మరి. కాగా ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: