ఇప్పుడు ఏపిలో రాజకీయం వాడీ వేడిగా కొనసాగుతుంది. త్వరలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలో వలసలు మొదలయ్యాయి. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ది పథంలో నడుస్తుందని చెబుతూ కొంత మంది నేతలు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుుకుంటున్న విషయం తెలిసిందే. మరికొంత మంది వైసీపీ లో చేరిన నేతలు త్వరలో పశ్చాతాప పడతారని ప్రతిపక్షనేతలు అంటున్నారు. ఇక వైసీపీ నేతల సినీ నటుడు నాగబాబు కొంత కాలంగా సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. తన మనసు లో ఏమనుకుంటే అది ఓపెన్ గా పెట్టేస్తూ పోస్ట్ చేస్తున్నారు.
ఇక ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసే సంధర్భంలో ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్న బుద్దా వెంకన్న, బొండా ఉమ లపై దాడి జరగగా నిన్న జనసేన శ్రీకాళహస్తి ఇంచార్జి పై దాడి జరింగింది. ఈ ఘటనలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా, జనసేన పార్టీ నేత, ప్రముఖ నటుడు నాగబాబు స్పందించారు. ‘టిక్ టాక్’ లో వచ్చిన ఓ వీడియోను పోస్ట్ చేసిన నాగబాబు, ‘అదీ పౌరుషం అంటే.. వైసీపీ వారి గూండా గిరికి నిలబడ్డ పెద్దాయన..‘ అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వీడియో ఇపపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంత పెద్ద వయసు ఉన్న పెద్దాయన రౌడీయిజానికి ఎదురొడ్డి పోరాడుతున్నారు.. అన్యాయాన్ని ఎదిరించడానికి వయసు అడ్డం కాదని ఆయన నిరూపించారని నెటిజన్లు అంటున్నారు. నిజంగా ఆ పెద్దాయన్ని చూస్తుంటే సీమ పౌరుషం గుర్తుకు వస్తుందని అంటున్నారు మరికొంత మంది నెటిజన్లు. మొత్తానికి ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎన్ని జిమ్మిక్కులు జరుగుతాయో.. ఎన్ని సంచలనాలు జరుగుతాయో చూాడాలి. తాజాగా నాగబాబు పోస్ట్ వైరల్ అవుతుంది.
అది పౌరుషం అంటే,,వైసీపీ వారి గుండా గిరికి నిలబడ్డ పెద్దాయన..https://t.co/bziWCiuRiI
— naga Babu konidela (@NagaBabuOffl) March 13, 2020