పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ చేయాల్సిన టాకీ పార్ట్ కంప్లీటయిందని సమాచారం. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో పాటు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాని మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అన్నీ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా తో పాటు క్రిష్ దర్శకత్వం లో సినిమాలో కూడా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం రీసెంట్ గా ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించారట. ఓ ప్రత్యేకమైన సెట్ లో పవన్ - అనసూయ ఇతర బృందంపై ఈ ప్రత్యేక గీతం చిత్రీకరణ జరిగిందని.. సాంగ్ అద్భుతంగా వచిందని చెప్పుకుంటున్నారు. 

 

పీరియడ్ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాదాపు రెండు వందల కోట్ల తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా కంప్లీటయ్యో సరికి ఈ బడ్జెట్ 250 కోట్లు దాటుతుందని అంటున్నారు. అయితే తాజాగా ఈ బడ్జెట్ విషయంలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయట. పవన్ మార్కెట్ ప్రకారం వర్క్ అవుట్ అవుతుందా అంటూ క్రిష్ ని అడుగుతున్నారట. 

 

అందుకు కారణం క్రిష్ తెరకెక్కించిన 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. ఎన్.టి.ఆర్ బయోపిక్ అయినప్పటికి పెద్ద డిజాస్టర్స్ గా మిగలడం కంప్లీట్ గా క్రిష్ వైఫల్యమే అన్న టాక్ జోరుగా సాగింది. అంతేకాదు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తో తెరకెక్కించిన 'మణికర్ణిక' సినిమాను క్రిష్ అనుకున్నట్టుగా తెరకెక్కించలేక మధ్యలో డ్రాపయ్యాడు. అది కూడా క్రిష్ మైనస్ అంటూ చెప్పుకున్నారు.

 

ఇలాంటి ట్రాక్ రికార్డ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏ రకంగా క్రిష్ కి ఛాన్స్ ఇచ్చాడు అంటూ ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. పొరపాటున గన తేడా జరిగితే ఇక్కడ డ్యామేజ్ అయ్యోది పవన్ కళ్యాణే అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.   ఈ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ క్రిష్ తో సినిమా ని కమిటయ్యి దారుణంగా బుక్కయ్యారుగా ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: