ప్రస్తుతం ఏ భాషలో అయినా ఏ దర్సకుడికైనా సినిమా తీయడం గొప్ప విషయం కాదు. ఆ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లడం అంతకంటే గొప్ప విషయం ... గొప్ప టాలెంట్ ఉండాలి. సినిమా తీసేశాం మాన్ పని అయిపోయింది అని దర్శక, నిర్మాత, హీరో హీరోయిన్ అనుకుంటే వర్కౌట్ అవదు. చాలా మంది కొత్త దర్శకులు అనుకున్న బడ్జెట్ లో మంచి సినిమాని తీస్తారు. కాని ప్రమోషన్స్ మాత్రం అసలు చేయడం చేత కాక సినిమాని జనాలకి చేరువ చేయలేకనే అవి దారుణంగా ఫ్లాపవుతున్నాయి. అందుకు చక్కటి ఉదాహరణ సమంత నటించిన జాను. ఈ సినిమా చాలా బావుంది అన్న టాక్ తప్ప హిట్ కలెక్షన్స్ వచ్చాయి అన్న మాట మాట మాత్రం వినిపించలేదు.

 

అయితే ఒక్కో సినిమాకి ఒక్కోలా ప్రమోషన్స్ చేస్తుంటారు. దాన్నే కాన్సెప్ట్ క్రియేటివి అంటారు. అలాంటిదే తాజాగా అనుష్క సినిమాకి జరిగింది. అనుష్క సినీ ఇండస్ట్రీకొచ్చి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు నిశ్శబ్దం సినిమా మేకర్స్. ఈ ఈవెంట్ కి టాలీవుడు స్టార్ సెలబ్రిటీస్ అందరూ హాకరయ్యారు. అనుష్కని తెలుగు తెరకి పరిచయం చేసిన పూరి జగన్నాథ్ నుండి రాజమౌళి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలు వచ్చారు. అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏమిటంటే రీసెంట్ గా అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం ట్రైలర్ ని విడుదల చేశారు. 

 

అయితే ఈ ట్రైలర్ కి అనుకున్నంతగా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దానికి కారణం ప్రస్తుతం జనాలకి సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఒకటి, కరోనా వైరస్ భయాలు, ఎగ్జాంస్ .. ఇలా రకరాల కారణాల వల్ల జనాలు నిశ్శబ్దం ట్రైలర్ ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే నిన్నటి వేడుక వల్ల నిశ్శబ్దానికి బాగానే మైలేజ్ వచ్చినట్టు కనిపిస్తుంది. సగం ఈ సినిమాని ప్రమోట్ చేయడానికే మేకర్స్ ఈ ఈవెంట్ ని నిర్వహించారన్న టాక్ వినిపిస్తుంది. అది వాస్తవం కూడా అనుకోవచ్చు. అయితే ఈ ఈవెంట్ అనుష్క కి ఎంతవర్జు ఉపయోగపడుతుందో నీఏమైనా క్లారిటి ఉందా అంటూ కొందరు అనుష్కని అడుగుతున్నారట. పైన చెప్పిన కారణాలతో సినిమా జనాలకి చేరకపోతే మాత్రం అనుష్క .. నా ఖర్మ అని ఫీలవ్వాల్సిందే. తనే కాదు తన స్థానం లో ఎవరున్నా అదే ఫీలవుతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: