వెండితెరమీద నవరసాలను సమర్ధవంతగా పడించగల గొప్ప నటుడు చిరంజీవి. అందుకే మెగాస్టార్ అయ్యారు. చిరులో మంచి కామెడీ టైంగ్ ఉంది. ఆయన పండించే కామెడీతో ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యోలా నవ్వుతారనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ ఫుల్ లెంగ్త్ కామెడి సినిమాలు చేసింది చాలా తక్కువ. వాటిలో చంటబ్బాయి, అందరివాడు సినిమాలు మెగాస్టార్ లో ఉన్న అద్భుతమైన హాస్యనటుడిని బయటకి తీసుకు వచ్చాయి. ఇంద్ర లోని కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక జై చిరంజీవ సినిమాలోని కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేశారు.

 

అయితే ఆయన కంబ్యాక్ మూవీస్ అయిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహా రెడ్డి సినిమాలలో మెగాస్టార్ కామెడీని చాలా వరకు మిస్సయ్యారు ప్రేక్షకులు. ఇక చిరంజీవి తాజాగా నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా మెగాస్టార్ పాత్ర కాస్త సీరియస్ గానే సాగుందని సమాచారం. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి 'ఆచార్య' అన్న టైటిల్ ని చిత్ర యూనిట్ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కి చెందిన అధికారిగా కనిపిస్తారని, నక్సల్స్ నాయకుడిగా ప్రజా నాట్యమండలి కళాకారుడిగాను కనిపిస్తారట. 

 

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని తాజా సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం కానుందట. చిరుతో మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ని తీయాలని త్రివిక్రమ్ మంచి కామెడి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట. త్రివిక్రమ్ సినిమాలో పంచ్ డైలాగులో ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అదే పంచ్ డైలాగులు మెగాస్టార్ చెబితే థియోటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ధ్రిల్ గా ఫీలవుతారు.

 

అయితే ఈ కథ చిరు గతంలో నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ చంటబ్బాయి సినిమా తరహాలో ఉంటుందట. ఇంకా చెప్పాలంటే ఆ కథ ఇన్స్పిరేషన్ తోనే ఇప్పుడు చిరు సినిమాకి కథ తయారు చేస్తున్నారట. అంటే త్రివిక్రమ్ చిరంజీవి ని మళ్ళీ ఇన్నాళ్ళకి డిటెక్టివ్ గా చూపించబోతున్నారనమాట. ఇది తెలిసే జనాలు మళ్ళీ కాపీ కథ అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: