మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ఆచార్య. ఆయన ఇటీవల నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ తో తెరకెక్కుతున్న ఈ ఆచార్య సినిమాలో మెగాస్టార్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిష ఎంపికైంది. నేడు సినిమా యూనిట్ తో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా నుండి తప్పుకోవడం జరిగిందని త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేసింది.

 

ఇక ఆమె స్థానంలో మరొక స్టార్ హీరోయిన్ ని తీసుకొని కొద్దిరోజుల్లో షూటింగ్ ప్రారంభించనుందట సినిమా యూనిట్. అలానే వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నారట. ఈ సినిమాలోని ఒక కీలకమైన విద్యార్థి నాయకుడి పాత్రలో ముందుగా రామ్ చరణ్ నటిస్తాడని వార్తలు వచ్చాయి, ఆ తర్వాత రామ్ చరణ్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ పాత్రలో నటిస్తారని ప్రచారం అయింది. అయితే వీరిద్దరిలో ఎవరు నటిస్తున్నారు అనేదానిపై ఇప్పటికీ ఎవరికీ ఎటువంటి క్లారిటీ లేదు. 

 

కాగా నేడు కొందరు మహేష్ బాబు సన్నిహితుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో మహేష్ బాబు నటించడం ఆల్మోస్ట్ గా కన్ఫర్మ్ అయిందని, అతి త్వరలో హిమాలయాలకు వెళ్లనున్న మహేష్, ఆ టూర్ నుండి తిరిగివచ్చిన తర్వాత ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటారని, అలానే ఆ వెంటనే పరశురాం తో సినిమా షూటింగులో జాయిన్ అవుతారు అని అంటున్నారు. మహేష్ నటించే ఈ తదుపరి రెండు సినిమాలకు సంబంధించిన విషయాల అప్డేట్లు, ఉగాది కానుకగా వెల్లడించడం జరుగుతుందని కూడా వారు అన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తే గనుక నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇవి రెండూ కూడా పెద్ద పండుగ వార్తలే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: