తెలుగుచిత్ర పరిశ్రమకు, పూరి జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూప‌ర్’ అనే మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన అనుష్క తన నటన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగింది.. సూపర్.. సినిమా సమయంలో నటనలో ఓనమాలు కూడ రాని ఈ బ్యూటీ.. స్వీటి  ‘అరుంధ‌తి’, ‘రుద్ర‌మ‌దేవి’, ‘బాహుబ‌లి’, ‘భాగ‌మ‌తి’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో తానేంటో నిరూపించు కుంది.. ఇకపోతే అనుష్క శెట్టి… సినీ ప్ర‌స్థానంలో తాజాగా 15 వ‌సంతాలు పూర్తి చేసుకుంది.

 

 

ఈ ఏడాది ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘నిశ్శ‌బ్దం’ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన 15 ఇయ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్ ఆఫ్ అనుష్క కార్య‌క్ర‌మంలో.. పూరి జగన్నాథ్.. అనుష్క గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అందులో అనుష్క మొట్టమొదటి సారిగా మేకప్ ముందుకు వచ్చిన సమయంలో జరిగిన సంఘటన తెలుసుకుంటే.. పూరి అనుష్కను సరదాగా ఫొటోలు తీద్దాం అని మేకప్ రవి దగ్గరకు తీసుకుని వెళ్లగా. అతను అనుష్కని చూడగానే ‘సార్.. పిల్లది బొంబాయా? అని అడిగాడట. అవునురా కొంచెం మేకప్ చెయ్ అని పూరి చెప్పగానే అతను స్వీటీ ముఖానికి మేకప్ వేస్తూ.. ఈ ముఖం ఏంటండీ బాబు.. ఎకరంన్నర ఉంది. ఇక్కడ్నుండి అక్కడ వరకూ మేకప్ వేయాలా? అని అడిగాడు.

 

 

ఇక ఆ మెకప్ వేసే అతను పొట్టినా కొడుకు ఈమె చాలా హైట్ ఉంటుంది. అప్పుడు నేను చెప్పా.. ఆ అమ్మాయిది బెంగుళూరురా.. తెలుగు తెలిసే ఉంటుంది.. నువ్ ఎదవ వాగుడు వాగొద్దు అన్నాను. వాడికి డౌట్ వచ్చి.. అమ్మా నేను ఏం అన్నానో నీకు అర్థమైందా? అని అనుష్కని అడిగాడు. ఈమె సైలెంట్‌గా తల ఊపింది. వాడు కంగారుపడిపోయి.. నేను తెలియక వాగాను.. ఈ విషయం నాగార్జున గారితో చెప్పొద్దు అన్నాడు అని పూరి జగన్నాద్ తెలిపారు.. కొత్త వారు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడితే ఇలాంటి సంఘటనలు ఎదురవడం కామన్‌గా మారిపోయింది అందుకే కావచ్చూ ఇప్పటికి అనుష్క ఈ విషయాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: