అరుంధతి.. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ ప్రత్యేకత ఉన్న చిత్రం.. అలాగే అనుష్క కేరీర్ ను మలుపు తిప్పిన చిత్రం.. అనుష్క సినీచరిత్రను అరుంధతికి ముందు.. అరుంధతి తర్వాత అని చెప్పుకునేలా చేసిన చిత్రం.. జేజమ్మగా తెలుగు ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్న చిత్రం. అయితే అసలు ఈ చిత్రంలో మొదట నటించాల్సింది అనుష్క కాదట.

 

 

అరుంధటి సినిమా తరువాత అనుష్క రాతే మారిపోయింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేనా.. అసలు లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే అనుష్క గుర్తొచ్చేలా చేసింది. ఆ సంవత్సరం విడుదలైన సినిమాలలో ఎక్కువ వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే మరి అలాంటి సినిమా మొదట వెళ్లింది ఎవరి దగ్గరకు.. హీరోయిన్ ఎందుకు వద్దని చెప్పంది..?

 

 

అరుంధతి ఆఫర్ మొదట మమతా మోహన్ దాస్ దగ్గరికి వెళ్లిందట. మమతా మోహన్ దాస్ తెలుసుకదా.. తెలుగులో ఇప్పుడు నటించడం లేదు లెండి. మమత తన నటనతోనే కాదు పాటలతోనూ అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. యమదొంగ, చింతకాయల రవి, కింగ్ సినిమాల్లో నటించి మెప్పించింది. యమదొంగలో ఆమె చేసిన ఓలమ్మీ తిక్క రేగిందా పాటకు డ్యాన్సు మాస్ అభిమానుల ఈలలు వేయించింది.

 

 

అయితే అరుంధతి స్టోరీ విన్నాక.. మమతా మోహన్ దాస్.. ఆలోచనలో పడిపోయిందట. ఇంత గంభీరమైన సినిమా చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని సందిగ్దంలో పడిందిట. ఆలోచించి రిస్క్ ఎందుకులే అని వదిలేసిందట. ఆ తర్వాతే ఈ ఆఫర్ అనుష్క దగ్గరకు వచ్చింది. అనుష్క ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని స్టార్ హీరోలకు పోటీగా ఎదిగింది. పాపం.. ఆ తర్వాత అరుంధతి సినిమా వదులుకున్నందుకు మమత చాలా ఫీలైందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: