టాప్ హీరోల అభిమానులు తమ హీరోల సినిమా కలక్షన్స్ రికార్డుల విషయంలోనే కాకుండా తమ హీరోలకు వచ్చే పారితోషిక విషయంలో కూడ తెగ బాధ పడిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భం జూనియర్ విషయంలో అతడి అభిమానులకు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో నటిస్తున్న జూనియర్మూవీ ప్రాజెక్ట్ తో ఆ సినిమా విడుదల కాకుండానే నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయాడు. ఈ మూవీ విడుదల తరువాత జూనియర్ కు జాతీయ స్థాయిలో ఏర్పడే క్రేజ్ గురించి ఇప్పటి నుంచే అతడి అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. 

 

ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి అతడికి 40 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు తారక్ అభిమానులకు నిరాశను కలిగిస్తున్నాయి. దీనికి కారణం ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటించిన ‘సాహో’ లో ప్రభాస్ కు 75 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వచ్చిన వార్తలు ‘బాహుబలి’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తరువాత ప్రభాస్ కు 70 కోట్లు పారితోషికం వచ్చినప్పుడు ఆ రేంజ్ లో జూనియర్ కు కూడ పారితోషికం రావాలి కదా అంటూ ఒక వింత వాదాన్ని తెర పైకి తీసుకువస్తున్నారు.


అంతేకాదు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కు సంబంధించి పవన్ కు కూడ 50 కోట్ల పారితోషికం వస్తున్నప్పుడు ఏ విషయంలో జూనియర్ తక్కువ అంటూ అతడి అభిమానులు తెగ బాధ పడుతున్నారు అని టాక్. వాస్తవానికి జూనియర్ త్రివిక్రమ్ ల మూవీకి కళ్యాణ్ రామ్ కూడ ఒక నిర్మాత. అయితే ఈ విషయాలను కూడ పట్టించుకోకుండా తారక్ అభిమానులు అతడి పారితోషికం గురించి పడుతున్న వేదన చూస్తుంటే టాప్ హీరోల గురించి అతడి కుటుంబ సభ్యుల కంటే అతడి కుటుంబ సభ్యులే ఎక్కువగా ఆలోచిస్తారు అని అనిపించడం సహజం..    

మరింత సమాచారం తెలుసుకోండి: