సూపర్ స్టార్ మహేష్ తో సినిమా అంటే ఏ దర్శకుడికైనా అదో డ్రీమ్ అన్నట్టే. అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ నిజం కాబోతుంది అన్న ఆనందంలో ఉన్నాడు పరశురామ్. సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత అసలైతే వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉన్నా కథ విషయంలో మహేష్ శాటిస్ఫై కాకపోవడంతో వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ కాన్సిల్ చేశాడు. ఇదే టైం లో మహేష్ కు పరశురామ్ కథ నచ్చడంతో ఆయనకు ఒకే చెప్పాడు.

 

యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరశురామ్ గీతా గోవిందం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా హిట్ అయినా కూడా నెక్స్ట్ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. ఈమధ్య నాగ చైతన్యతో పరశురామ్ సినిమా అని వార్తలు వచ్చాయి. కానీ చైతు ప్లేస్ లో మహేష్ వచ్చి చేరాడు. మహేష్ తో పరశురామ్ మూవీ ఉగాది రోజున ముహూర్తం పెట్టుకుంటారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ మెగా కాస్ట్ వివరాలు తెలియాల్సి ఉంది.

 

మహేష్ ను మెప్పించే కథ సిద్ధం చేశాడు అంటే.. కచ్చితంగా పరశురామ్ మరో గీతా గోవిందం అంతకుమించి హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. మహేష్ తో సినిమా గురించి కలగన్న డైరక్టర్ పరశురామ్ మహేష్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. సినిమా కథ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. పరశురామ్ కెరియర్ లో మొదటి భారీ బడ్జెట్ ఇది. ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం పరశురామ్ కూడా స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేరినట్టే. పరశురామ్ కు ఛాన్స్ ఇచ్చి అతని కళను నిజం చేస్తున్నాడు మహేష్.  ఈ సినిమాలో కియారా, పూజా హెగ్డే ఇద్దరిలో ఒకరు హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: