బాహుబలి సినిమాతో ఇండియా లెవెల్లో ఇమేజ్ ని దక్కించుకున్న అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఫిమేల్ లీడ్ ఉన్న సినిమాలే ఒప్పుకుంటున్న రెండేళ్ల క్రితం వచ్చిన భాగమతి సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం నిశ్శబ్దం కోన ఫిలిమ్స్ కార్పోరేషన్ బ్యానర్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ ౨వ తేదీన విడుదల అవుతుందని ప్రకటించారు. 

 


ఇటీవల నిశ్శబ్దం ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ట్రైలర్ తో పాటు అనుష్క పదిహేను సంవత్సరాల పండగ బాగా ఫోకస్ లోకి వచ్చింది. అయితే నిశ్శబ్దం తర్వాత అనుష్క సినిమాల్లో నటించదని, పెళ్ళి చేసుకుని సెటిల్ అవుతుందని రోజూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నింటికీ సమాధానంగా అనుష్క తన పెళ్ళి ఎప్పుడు జరిగేదుంటే అప్పుడు జరుగుతుందని, దానికోసం ఎక్కువ టెన్షన్ పడవద్దని చెప్పింది.

 

అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం అనుష్క తన తర్వాతి చిత్రాన్ని కన్ఫర్మ్ చేయనుందట. ఒకానొక ఫ్లాప్ డైరెక్తర్ తో సినిమా చేసేందుకు చూస్తుందని సమాచారం. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన రారా క్రిష్ణయ్య చిత్ర దర్శకుడు మహేష్ బాబు అనుష్క హీరోయిన్ గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసాడట.  ఆ కథని అనుష్కకి కూడా వినిపించాడని అంటున్నారు.  కథ నచ్చడంతో అనుష్క ఓకే చేసే ఆలోచనలో ఉందని చెప్తున్నారు.

 


అంతా మంచిదే కానీ సినిమా తీసి ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉన్న దర్శకుడితో సినిమా చేయడానికి అనుష్క ఎలా ఒప్పుకుంటుందనేది సందేహంగా ఉంది. కానీ ఒకవిధంగా చూస్తే అనుష్కతో సినిమాలు చేసిన చాలా మంది అంతకుముందు ఖాళీగా ఉన్నవారే. ఇప్పుడు నిశ్శబ్దం దర్శకుడూ హేమంత్ మధుకర్ కూడా ఫ్లాప్ చిత్రాలు తీసినవాడే. మరి అనుష్క గట్ ఫీలింగ్ ఏంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: