తెలుగు సినిమాల్లోకి అనుష్క ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంలో పెద్ద పండగే చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. అనుష్క గురించి ఎవరు మాట్లాడినా ఆమె నిండైన రూపం గురించి మాత్రమే కాదు అంతకుమించి ఆమె మంచితనం గురించి కూడా మాట్లాడారు. మంచితనంలో అనుష్కను మించిన హీరోయిన్ లేదంటూ ఆమె గురించి ఆమె వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చారు. అనుష్కను సినిమాల్లోకి తీసుకొచ్చిన పూరి జగన్నాధ్ అయితే తన మాటలతో అనుష్క గొప్పదనం చెప్తూ ఆమె విషయంలో తానేం చేస్తానో చెప్పాడు.

 

 

అనుష్క కనపడితే తాను, ఛార్మీ, రవితేజ.. ఆమె కాళ్లకు దణ్ణం పెడతారట. కారణం ఆమెలో ఉండే సుగుణాలు, మంచితనంలో కొద్దిమేర అయినా తమకు రావాలని అలా చేస్తారట. అనుష్క గురించి ఎందరు ఎన్ని చెప్పినా పూరి జగన్నాధ్ చెప్పిన మాటలు సభలోని వారికి ఆకట్టుకున్నాయి. ఈ మాటలు విన్న వారికి, ప్రోగ్రామ్ చూసిన వారికి కూడా అనుష్కలో కొత్త కోణం తెలిసిందనే చెప్పాలి. ఇంత మంచితనం అనుష్కలో ఉందా అనిపించేలా పూరి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయనే చెప్పాలి. ఇన్నోవేటివ్ మైండ్ గా పూరి జగన్నాధ్ ఎంతోమంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. పూరి పరిచయం చేసిన హీరోయిన్లలో అనుష్కదే టాప్ ప్లేస్.

 

 

తొలి సినిమా సూపర్ లోనే తన అందంతో ఆకట్టుకుంది అనుష్క. సినిమాకు తగ్గ గ్లామర్ పాత్రలో మెరిసిపోయింది. ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన అనుష్క టాప్ హీరోలందరితో యాక్ట్ చేసింది. తమిళ్ లో కూడా అనుష్క మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం లీడ్ హీరోయిన్ క్యారెక్టర్లు చేయకపోయినా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లతో మెప్పిస్తోంది. తన కోసమే కథలు రాసుకునే స్థాయికి ఎదిగింది స్వీటీ. కెరీర్లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా కెరీర్లో రాణిస్తోందీ యోగా టీచర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: