మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన మీరో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ మూవీ ‘కంచె’ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ జాతీయ అవార్డు కూడా కైవసం చేసుకుంది. వరుణ్ తేజ్ ‘ఫిదా’ సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్’ మూవీతో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తాజాగా ‘బాక్సర్’ మూవీలో నటిస్తున్నాడు. యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ కలగలిపి ఈ మూవీలో ఉండబోతున్నాయట. ఈ మూవీ కోసం మూడు నెలల పాటు కఠోర శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. విశాఖపట్నంలో మొదటి షెడ్యూల్ మొదలవ్వగా రెండు రోజుల క్రితం అది పూర్తయింది.
రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ఏప్రిల్ నుండి మొదలవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తారని వినికిడి. జులై 30కి ఎలాగైనా మూవీ విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు నిర్మాతలు. ఈ మూవీతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అల్లు వెంకటేష్, సిద్దు ముద్ద ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. అయితే ఈ మూవీలో మరో కీలక పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తన పాత్ర తక్కువైనా నిడివి అయినా సరే ఆ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఎఫ్ 2, గద్దల కొండ గణేష్ హిట్స్ తర్వాత బాక్సర్ మూవీ హిట్ అయితే మనోడు హ్యాట్రిక్ విజయం అందుకున్నట్టే అవుతుంది. దాంతో కొంత కాలం తన కెరీర్ కి ఏలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు పోటీ పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నాడు. అలాగే నదియా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ‘బాక్సర్’ తో బాక్సాఫీస్ షేక్ చేస్తాడా లేదా చూడలి.