మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాల్లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొమ్మిది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడంతో సైరా అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేశాడు చిరంజీవి. ఈ చిత్రం తెలుగులో బాగానే ఆడినప్పటికీ ఉత్తరాదిన అంతగా ఆకట్టుకోలేకపోయింది.

 

 

అయితే సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆచార్య అనే పేరు కూడా కన్ఫర్మ్ అయింది. అధికారికంగా పేరును కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ చిరంజీవి ఒకానొక ఫంక్షన్ లో రివీల్ చేయడంతో అందరికీ తెలిసిపోయింది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం గురించి ఏదో ఒకవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.

 

 


నిన్నటికి నిన్న సీనియర్ హీరోయిన్ త్రిషసినిమా నుండి
తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తాను తప్పుకోవడానికి గల కారణాలని  క్రియేటివ్ డిఫరెన్సెస్ గా చూపించింది. అయితే ప్రస్తుతం త్రిష చుపిన ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏంటా అని ఆలోచించడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం కొన్ని కారణాలు బయటపడ్డాయి.

 

 

చిరంజీవి కొరటాల కాంబినేషన్లో వచ్చేది కమర్షియల్ మూవీ అని అందరికీ తెలిసిందే. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ కి నటించడానికి స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే నటనా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తున్న త్రిష ఈ డిఫరెన్సెస్ కారణంగానే సినిమా నుండి తప్పుకుంది కావచ్చని అంటున్నారు. అదీ గాక చిరంజీవితో పాటు మరో హీరోకి కూడా స్పేస్ ఎక్కువ ఉన్న కారణంగా హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండదని భావించి ఉండవచ్చని అనుకుంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: