చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన భయంకరమైన కరోనా (కోవిడ్ 19) వైర్ ఇప్పుడు ప్రపంచాన్ని గడ గడలాడిస్తుంది. ఎక్కడ చూసినా.. కరోనాకు సంబంధించిన న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.  ప్రపంచాన్ని ఇంతగా భయపెడుతున్న కోరానా వైరస్ గురించి ఎవరికి తోచింది వారు చెబుతున్నారు.  ఇదొక భయంకరమైన భూతమని.. జనాలను పట్టి పీడించడానికే వచ్చిందని కొంత మంది అంటే.. మరికొంత మంది దేవుడే కలికాలం అంతం చేయడానికి కరోనాను పంపాడని అంటున్నారు. అయితే ఈ భూమిపై పశు పక్షాదులు పూర్తిగా నశించి పోతున్నాయని.. వాటిని రక్షించడానికి దేవుడు కరోనా వైరస్ ని పంపాడనని అందుకే మాంసం తినాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని మరికొంత మంది అంటున్నారు.

 

ఎవరేమన్నా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు 5 వేల మంది బలి అయ్యారు. వేల మంది ఈ భయంకర వ్యాధి భారిన పడి తల్లడిల్లుతున్నారు.  చైనా తర్వాత ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ లో ఉందని డాక్టర్లు అంటున్నారు.  తాజాగా కరోనా గురించి సెలబ్రెటీలు రక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.  తాజాగా ఈ  కరోనా గురించి మెగా బ్రదర్ నాగబాబు తనదైన స్టైల్లో మరోసారి కామెంట్ చేస్తున్నారు.  నాగబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

'కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే.. కరోనా వైరస్‌ని వాళ్ల దేవుడే ఈ భూమి మీదకి పంపించాడు అని అంటున్నారు. అయినా ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమా' అని ట్వీట్ చేశారు.  కాగా, 'మాంసాహారులను దండించడానికి దేవుడు ధరించిన కోపావతారమే కరోనా వైరస్' అని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి ఇటీవలే వ్యాఖ్యానించారు.  మొత్తాానికి కరోనా వైరస్‌ చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత పెద్దలు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: