సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు.  లింగ నుంచి మొన్నటి దర్భార్ వరకు ప్రతి సంవత్సరం ఓ మూవీ రిలీజ్ అవుతూనే ఉంది.  హిట్టు... ప్లాపు అనే సంబంధ లేకుండా రజినీ సినిమాలకు ఉన్న క్రేజ్ తో దర్శక, నిర్మాతలు ఆయనతో కమిట్ అవుతుంటారు.  ఈ ఏడాడి మురుగదాస్ తో ‘దర్భార్ ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ మూవీ హిట్ టాక్ వచ్చినా.. బడ్జెట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.  ప్రస్తుతం రజినీకాంత్  శివ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు.  ఇటీవలే ఈ సినిమాకి 'అన్నాత్తే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమాగా ఇది నిర్మితమవుతోంది.  


అక్టోబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కాకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఇక కన్నడ హీరో యష్ ఆ మద్య ‘కేజీఎఫ్’ మూవీతో ప్రేక్షకుల ముందుక వచ్చాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’ మంచి విజయం అందుకుంది. ఈ మూవీతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు ఈ కుర్ర హీరో.

 

 తాజాగా  కన్నడలో యష్ హీరోగా 'కేజీఎఫ్ 2' రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను అక్టోబర్ 23వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. మరో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన్నారు. అయితే రజినీకాంత్ తో కుర్ర హీరో ఎలా పోటీ తట్టుకుంటాడు.. ఒకవేళ ఏ మూవీకి బ్యాడ్ టాక్ వచ్చినా.. మరో మూవీ క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని అంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: