2005 `సూపర్` సినిమా నుంచి 2018 `భాగమతి` వరకు ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసే అనుష్క అంటే ఇష్టంలేని వారు ఉండరు. హీరోలతో సమానంగా పాపులారిటీ, పారితోషకాలు అందుకోగల అతి కొద్దిమంది టాలీవుడ్ హీరోయిన్లలో ఈమె ఒకరు. ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించి 15 వసంతాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ అందచందాల్లోనూ, అభినయాల్లోనూ తనకు తానే సాటిగా నిలిచారు. మాములుగా ఈ భామ నటించడం కాదు.. జీవిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ పాత్రకే నిండుదనం తెస్తుంది.
అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో లేడీ ఓరియంటడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఇండియా వైడ్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే సినిమా చేస్తుంది. ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇక అసలు విషయంలోకి వస్తే.. మహేష్ దర్శకత్వంలో అనుష్క మూవీ. మహేష్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కాదండోయ్.. సందీప్ కిషన్, రెజినా కాసాండ్రా జంటగా 2014లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రా రా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్ బాబు.
రితేష్ దేశ్ముఖ్, జెనీలియా జంటగా నటించిన ‘తేరే నాల్ లవ్ హో గయా’ అనే హిందీ చిత్రానికి ఫ్రీమేక్ అయిన ఈ చిత్రానికి కథ, కథనం తనదే అని కార్డు వేసుకున్నాడు దర్శకుడు మహేష్బాబు. హిందీలో ఆ చిత్రం విజయవంతం అయినప్పటికీ.. తెలుగులో మాత్రం విజయం సాధించలేదు. దీనితో ఈ చిత్ర దర్శకుడు మహేష్ కి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. కాగా, ఆ చిత్రం విడుదలైన దాదాపు ఆరేళ్ళ తరువాత ఆయన అనుష్క శెట్టిని తన స్టోరీ లైన్ తో ఇంప్రెస్ చేశారట. దీనితో అనుష్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయండి సినిమా చేద్దాం అని ఆఫర్ ఇచ్చారట. మరి అనుష్క నుండి సినిమా చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే భారీ లక్ తగిలినట్టే అని చెప్పుకోవాలి.