నాకు పెళ్లి చేసేయండి నాన్నా... అని లావణ్య త్రిపాఠి అని దాదాపు పదేళ్ళు అవుతుంది. ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది ఆ డైలాగ్ తో. అమ్మాయిలూ, అబ్బాయిలు అందరూ ఆమెను ఫాలో అయ్యారు. చాలా మంది అమ్మాయిలు ఇళ్ళల్లో ఆ మాటను ట్రై చేసి తిట్లు కూడా తిన్నారు. ఆ విధంగా లావణ్య పాపులర్ అయింది. అక్కడి నుంచి ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అని భావించారు. కాని ఆమె చాలా తక్కువ సినిమాలే చేస్తూ వస్తుంది. వరుసగా సినిమాలు చేసిన సందర్భం గాని ఎప్పుడూ లేదనే చెప్పాలి. 

 

దానికి కారణం ఏంటీ అనేది తెలియడం లేదు. అయితే ఆమె సినిమాలు వద్దు అనుకుంది అంటున్నారు. టాలీవుడ్ లో ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని భావించారు. కాని ఆమె సినిమాల మీద అంత ఆసక్తి చూపించలేదని భావించిన దర్శకులు ఆమెను పక్కన పెట్టారని అంటున్నారు. వరుస అవకాశాలు వచ్చే పరిస్థితి ఉన్నా ఆమె లైట్ తీసుకుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె సినిమాలు చెయ్యాలని చూస్తున్నా ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని మరికొందరు అంటున్నారు. మరి కొందరు అయితే ఆమె సినిమాలు వదిలేసింది అంటున్నారు. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త హీరోయిన్ ల హవా కొనసాగుతుంది. దీనితో ఆమెకు క్రేజ్ పడిపోయింది అంటున్నారు. ఆమెను పెద్దగా ఎవరూ చూడటానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఆమెను తప్పించారు అంటున్నారు. అయితే ఆమెపై ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని అందుకే సినిమాల నుంచి వెళ్లిపోయారని ఒక అగ్ర హీరో కుటుంబం తో ఆమె ఎక్కువగా స్నేహం చేసారని అది ఎక్కువగా ఇబ్బంది పెట్టేసింది అంటున్నారు మరికొందరు. ఇటీవల ఆమెపై ఐటి దాడులు జరగడం తో హైదరాబాద్ రావడానికి ఇష్టపడలేదని అంటున్నారు. అవకాశాలు వచ్చినా వద్దని అంటుందని మరికొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: