టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ, ప్రీతీ గా... శాలిని పాండే నటనకు అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా సాధించిన విజయం చూసి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ఆ రేంజ్ లో ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు. వరుసగా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. 

 

కాని హీరోయిన్ గా చేసిన నటించిన శాలిని పాండే కి మాత్రం అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందుకి రావడం లేదని అంటున్నారు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియలేదు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమాలో ఆమె నటించింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. అటు తమిళంలో కూడా అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. అయినా సరే ఆమెకు పెద్దగా అవకాశాలు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. 

 

అయితే ఆమెను టాలీవుడ్ వద్దని అంటుందట. దానికి కారణం ఏంటో తెలియకపోయినా... ఆమె కోసం విజయ్ దేవరకొండ చేసిన ప్రయత్నాలే ఆమె కెరీర్ ని ఇబ్బంది పెట్టాయని, ఒక ప్రముఖ దర్శకుడి వద్దకు ఆమె వెళ్ళగా, నిర్మాత ద్వారా విజయ్ దేవరకొండ ఆమెకు సినిమా ఇప్పించే ప్రయత్నం చేసాడని దీనితోనే ఆమెను పక్కన పెట్టారని అంటున్నారు. విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మందికి శత్రువు అయ్యాడు. కారణం ఏంటో తెలియకపోయినా అతన్ని చాలా మంది ఇష్టపడటం లేదు. అందుకే అతను చెప్పడం వలనే శాలిని పాండే ని పక్కన పెట్టారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: