జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఏడాదికో రెండేళ్ళ కో ఒక సినిమా చేసే వారు. ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో మొదటి పాట ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చింది కూడా. ఆ పాట సూపర్ హిట్ అయింది. 

 

ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ తో చేస్తున్నాడు. దీనికి ఇప్పటికే కొబ్బరి కాయ కూడా కొట్టాడు పవన్. వచ్చే ఏడాది రానుంది ఈ సినిమా. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు పూరి జగన్నాథ్ తో సినిమా చేసే ప్లాన్ చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో బద్రీ సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో దాదాపు 12 ఏళ్ళ తర్వాత కెమరామెన్ గంగ తో రాంబాబు సినిమాలో నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత పవన్ ఇప్పుడు మరో సినిమా చేసే ప్లాన్ చేస్తున్నాడు. 

 

సినిమా లో పవన్ కళ్యాణ్ సిఎం గా నటిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని లేదా జులై తర్వాత సెట్స్ మీదకు వెళ్ళినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన హర్చాలు జరుగుతున్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందో లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: