అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌ కాంబినేషన్‌ లో అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.. అయితే.. ఈ సినిమాపై కింగ్ నాగార్జున అక్కినేని అఖిల్ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారట. నాగార్జున ఎప్పటికప్పుడు తన కుమారుల సినిమాలపై కన్నేసి ఉంచుతాడు. అన్ని సినిమాల్లాగానే సోగ్గాడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కాగా., ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరిపిస్తున్నారట.

 

 

 

అక్కినేని అఖిల్ నాలుగవ సినిమా అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ మధ్యే నాగార్జున ఫైనల్ కట్ కూడా చూసినట్లు ప్రచారం జరుగుతుంది. అసలు భాస్కర్ ను బొమ్మరిల్లు, పరుగు సినిమాల తర్వాత తెలుగు అభిమానులు పూర్తిగా మరిచిపోయారు. ఇదిలా ఉంటే కింగ్ నాగార్జున అఖిల్ సినిమాలో కొన్ని సీన్లలో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే.. నాగార్జున ఆ సన్నివేశాలను రీ షూట్ చేయాలని దర్శకుడు భాస్కర్ సూచించినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ విషయం పై ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.

 

 

అక్కినేని నాగార్జున గతంలో కూడా కొన్ని సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను రీ షూట్ చేయించాడు. ఆయన సినిమా రీ షూట్ చేస్తే సినిమా బాగోకపోవడం కాదు.. దాన్ని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం అని చెప్తాడు కింగ్ నాగార్జున. కాగా., ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలను షూట్ చేయాలని ఆ సన్నివేశాలను ఇంకా బాగా ప్రయత్నించాలని చెప్పినట్లు సమాచారం. అయితే.. ఈ సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలనుకున్నారట చిత్ర యూనిట్. అనుకోని పరిస్థతులలో రెండు నుంచి నాలుగు నెలల సమయం వరకు పోస్ట్ పొన్ అయిందని వెల్లడించారు.

 

 

 

గతంలో అక్కినేని అఖిల్.. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు అన్ని ఆశలు నాలుగో సినిమాపై ఉన్నాయి. అఖిల్ కూడా ఈ సినిమాపై బానే ఆశలు పెట్టుకున్నాడని చెప్పవచ్చు. మరి ఈ సమయంలో నాగార్జున కూడా ఈ సినిమాపై ఫోకస్ చేయటంలో ఎలాంటి తప్పులు లేవని అంటున్నాయి సినీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: