మాస్ మహారాజ రవితేజ రాజాది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ హిట్ అన్న మాట వినలేదు. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఏ డైరెక్టర్ ఒక మంచి హిట్ ఇస్తాడో అంటూ ఆశగా ఎదురు చూస్తున్నాడు. నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా ఇలా అన్ని సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. ఎక్స్పరిమెంట్స్ చేసినా, డిఫరెంట్ జోనర్స్ లో సినిమాని ట్రై చేసినా చివరికి ఫ్లాపే అవుతుంది. దాంతో రవితేజ మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. మళ్ళీ తన మార్కెట్ పెరగాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పోటీని తట్టుకోవాలన్నా అర్జెంటుగా ఒక మంచి కమర్షియల్ హిట్ దక్కాలి. ఆ ప్రయత్నాలే రవితేజ చేస్తున్నాడు. 

 

ఆ ప్రయత్నాలలో భాగగంగా మాస్ రాజా నటిస్తోన్న తాజా చిత్రం క్రాక్. ఇంతకముందు రవితేజ తో డాన్ శ్రీను, బలుపు వంటి కమర్షియల్ హిట్ సినిమాలను రూపొందించిన గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తాజా సమాచారం. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ సెంట్రల్ జైలుకి సంభందించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.  

 

ఏప్రిల్ మొదటి వారం వరకు ఈ షెడ్యూల్ జరగనుందట. దీంతో టాకీ మొత్తం పూర్తవుతుందని చిత్ర బృందం వెల్లడించారు. ఏప్రిల్ 4నుండి జెర్మనీలో పలు అందమైన ప్రదేశాల్లో రెండు పాటలని చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేశారట . ఆ తర్వాత హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఒక పాటని షూట్ చేయనున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి మే 8న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తారట. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ టీజర్ తో క్రాక్ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమాతో అయినా రవితేజ్ మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: