చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ సై అంటే సై అంటున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్టు పోటీ పడుతున్నారు. పందెంలో పై చేయి సాధించేది నువ్వా నేనా అన్న రేంజ్ లో పరుగులు తీస్తున్నారు. ఇక మెగా నందమూరి రన్నింగ్ రేసుతో కొరటాల శివ, బోయపాటి శ్రీనుకి కొత్త టెన్షన్స్ మొదలవుతున్నాయట. 

 

చిరంజీవి, బాలకృష్ణ బరిలో ఉన్నారంటే చాలు టాలీవుడ్ మొత్తం అలర్ట్ అవుతుంది. ఈ హీరోల హంగామా చూడ్డానికి బాక్సాఫీస్ కూడా ప్రిపేర్డ్ ఉంటుంది. ఇక అభిమానుల సందడి అయితే చెప్పనక్కర్లేదు. ఈ హీరోలు క్రియేట్ చెయ్యబోయే రికార్డుల కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు. యంగ్ ఏజ్ లో కలెక్షన్ల రేసులో పోటీపడ్డ ఈ సీనియర్లు, ఇప్పుడు స్పీడ్ గా షూటింగ్ లు పూర్తి చేయడంలోనూ పోటీ పడుతున్నారు. 

 

చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని ఓపెన్ గానే చెప్పాడు. 99రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని కొరటాల శివకు పబ్లిక్ గా చెప్పాడు. ఇక చిరు టార్గెట్ గా పెట్టడంతో కొరటాల కూడా ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ స్పీడ్ చూస్తే ఆచార్య దసరా బరిలో దిగుతాడని చెబుతున్నారు సినీజనాలు. 

 

బాలకృష్ణ బోయపాటి సినిమాను చాలా తక్కువ కాల్షీట్స్ లో పూర్తి చేయాలనుకుంటున్నాడు. కుదిరితే 75రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేయాలని బోయపాటి శ్రీనుకు టార్గెట్ పెట్టాడట. ఇక వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై భారీ బజ్ ఉంది.

 

ఈ అంచనాలను మ్యాచ్ చేస్తూనే బాలయ్య పెట్టిన టార్గెట్ ను రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడట బోయపాటి. ఈ సీనియర్ల మాదిరిగానే యంగ్ స్టర్స్ కూడా స్పీడ్ గా సినిమాలు చేస్తే థియేటర్లు పండుగ చేసుకుంటాయని చెప్పొచ్చు. మొత్తానికి బాలయ్య, చిరంజీవి సై అంటే సై అంటున్నారు. నువ్వా నేనా అని పోటీపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: