టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా చేస్తే చాలు తమ జన్మ ధన్యం అయినట్లే అని ఎందరో హీరోయిన్లు భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక విషయంలో ఏకంగా ముగ్గురు అక్కాచెల్లెళ్లు మెగాస్టార్ సరసన హీరోయిన్లు గా జోడి కట్టడం జరిగింది. అయితే అది కావాలని జరిగినది కాదని, యాదృచ్చికం అని వారు అంటున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, నాటి హీరోయిన్ నగ్మా, ఆమె సోదరీమణులు అయిన జ్యోతిక, రోషిణి ముగ్గురూ కూడా టాలీవుడ్ లో హీరోయిన్లు గా మంచి పేరు సంపాదించారు. 

 

అయితే వారిలో నగ్మా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగగా, ఆపై వచ్చిన రోషిణి తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షలమెప్పు పొందారు. ఇక ఆపై వచ్చిన జ్యోతిక కూడా పలు సినిమాల్లో నటించి పెద్ద హీరోయిన్ గా మంచి పేరు గడించారు. అయితే ముందుగా నగ్మా, మెగాస్టార్ చిరంజీవి సరసన ఘరానామొగుడు సినిమాలో హీరోయిన్ గా నటించారు. అప్పట్లో ఆ సినిమా అతిపెద్ద విజయాన్ని అందుకుంది, ఆపై ముగ్గురు మొనగాళ్లులో కూడా ఆమె మెగాస్టార్ తో జోడి కట్టగా, ఆ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. 

 

ఇక మెగాస్టార్ తో మాస్టర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన రోషిణి, ఆ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో పాటు, తన అందం, అభినయంతో మెగా ఫ్యాన్స్ ని అలరించింది. కొన్నేళ్ల క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఠాగూర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన జ్యోతిక కూడా సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఈ విధంగా ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా మెగాస్టార్ సరసన హీరోయిన్లుగా నటించి మంచి సక్సెస్ లను తమ ఖాతాలో వేసుకోవడం జరిగింది. అయితే మెగాస్టార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నటుడు అని, అందుకే ఆయనకు అంత క్రేజ్ రావడం జరిగిందని వారు అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: