నందమూరి యువ నటుడు కళ్యాణ్ రామ్, ముందుగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన తొలిచూపులోనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు. అయితే అంతకముందు బాలయ్య హీరోగా తెరకెక్కిన బాలగోపాలుడు సినిమాలో బాలనటుడిగా నటించిన కళ్యాణ్ రామ్, హీరోగా మారిన తరువాత కెరీర్ మూడవ సినిమాగా రిలీజ్ అయిన అతనొక్కడే సినిమాతో మంచి హిట్ ని అందుకున్నారు. ఇక ఆ తరువాత నుండి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుని ముందుకు సాగిన కళ్యాణ్ రామ్, మధ్యలో కొన్ని విజయాలు, అపజయాలతో ముందుకు సాగారు. 

 

అయితే 2013లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని కళ్యాణ్ రామ్ కు కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. అయితే అప్పటి నుండి మొన్నటి ఎంత మంచివాడవురా వరకు ఆయనకు కెరీర్ పరంగా వచ్చిన సినిమాలు ఆశించిన రేంజ్ విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం కొత్త దర్శకుడు మల్లాది వశిష్ఠ దర్శకత్వంలో రవాణ సినిమా లో నటించడానికి కళ్యాణ్ రామ్ సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఒక ప్రముఖ యువ దర్శకుడి సినిమాలో కూడా అతి త్వరలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించనున్నారని, ఇటీవల ఆ దర్శకుడు ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని, కొద్దిరోజుల క్రితం అతడు కళ్యాణ్ రామ్ కు మంచి స్టోరీ వినిపించడం, అది ఆయనకు నచ్చడంతో అతి త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనపడుతోందని అంటున్నారు. కెరీర్ పరంగా ప్రస్తుతం కొంత డైలమాలో పడ్డ కళ్యాణ్ రామ్, ఆ సినిమా కోసం రావణ ని కూడా ప్రక్కన పెట్టినట్లు మరొక వార్త ప్రచారం అవుతోంది. అయితే తదుపరి నటించబోయే సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని భావిస్తున్న కళ్యాణ్ రామ్, ఎంతో జాగ్రత్తగా ఆలోచన చేసి ఇకపై ముందుకు సాగాలని నిర్ణయించారట....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: