పాపం మాస్ మహారాజ రవితేజ ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని మాంచి ఊపు మీద ఉండేవాడు. కానీ గత కొంతకాలంగా హిట్ కోసం మొహం వాచిపోయి ఉన్నాడు. ఒక్క హిట్ ఒక్కటంటే ఒక్క హిట్ మళ్ళీ నేనేంటో చూపిస్తా ..హిట్లు బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తా అంటూ డైరెక్టర్ ని మంచి కథ కావాలని ఇన్‌డైరెక్ట్ గా అడుగుతున్నాడట. ఎందుకంటే ఈ మాస్ రాజా కి రాజాది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ హిట్ దక్కలేదు. నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా ఇలా అన్ని సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. ఎక్స్పరిమెంట్స్ చేసినా, డిఫరెంట్ జోనర్స్ లో సినిమాని ట్రై చేసినా చివరికి ఫ్లాపే అవుతుంది. దాంతో రవితేజ మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. దాంతో స్టార్ హీరో అన్న ఇమేజ్ మొత్తం పోయింది.

 

అందుకే ఇప్పుడు మళ్ళి తను స్టార్ హీరో అనిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేని తో జత కట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం క్రాక్. గతంలో గోపీచంద్ మలినేని రవితేజ తో డాన్ శ్రీను, బలుపు వంటి కమర్షియల్ హిట్ సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం గోపీచంద్ మలినేని క్రాక్ తో రవితేజని చెక్కుతున్నాడు. ఒక యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

 

అయితే ఈ సినిమాకి రవితేజ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. అంటే ఫ్రీగా సినిమా చేస్తున్నాడని అనుకోకండి. మన మాస్ రాజ ఇక్కడ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడట. అదేమిటంటే బాలీవుడ్ స్టార్ హీరో అక్ష్య కుమార్ ని ఫాలో అవడం. ఆయన సినిమా కి రెమ్యూనరేషన్ తీసుకోడు. సినిమా హిట్ అయి బాగా ప్రాఫిట్ వస్తే అందులో షేర్ తీసుకుంటాడు. ఇలా బాలీవుడ్ లో ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే ఉండటం విశేషం. అందుకే రవితేజ కొత్తగా ఈ బాలీవుడ్ హీరోని ఫాలో అవుతూ క్రాక్ సినిమాకి రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోకుంటాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: