తెలుగు సినిమా రంగంలో బాలయ్య బాబు కెరీర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో పడినట్లు తెలుస్తోంది. చేస్తున్న ప్రతి సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవడంతో చాలావరకు నందమూరి అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర రెండు భాగాలుగా తెరకెక్కించిన బాలయ్యబాబు, ఆ రెండు సినిమాలలో ఒక సినిమాతో కూడా విజయం సాధించకపోవడంతో తీవ్ర నిరుత్సాహం చెందారు. ముఖ్యంగా 2019 ఎన్నికల టైంలో ఆ సినిమా రిలీజ్ అయ్యి దారుణంగా ఫ్లాప్ అవడంతో బాలయ్య అభిమానులు తట్టుకోలేక పోయారు.

 

ఇటువంటి తరుణంలో చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో...బాలయ్య బాబు తనకు మర్చిపోలేని రెండు అదిరిపోయే బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన బోయపాటి దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇదిలా ఉండగా డైరెక్టర్ బోయపాటి తన సినిమాలను చాలా రాయల్టీ గా క్వాలిటీ గా చూపించాలని ఖర్చు విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అప్పట్లో వ్యవహరించారు. అయితే ఆ తర్వాత బోయపాటి - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ భారీ నష్టాల్ని మిగిల్చింది. ఇటువంటి తరుణంలో బాలయ్య బాబు చేయబోయే సినిమా విషయంలో బడ్జెట్ విషయంలో కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలని లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా మొత్తం అయిపోవాలని బోయపాటికి చెబుతుంటే ఆయన రియలైజ్ అవ్వట్లేదు అంట.

 

ముఖ్యంగా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంటే తీసుకోలేకపోతున్నాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో బాలయ్యపై బోయపాటి కాస్త అసహనంగా ఉన్నాడని సమాచారం. అయితే ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన బాలయ్యబాబు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కొంత డౌన్ అవుతుంటే...భయంకరమైన అట్టర్ ఫ్లాప్ సినిమా తీసిన బోయపాటి ఈ విధంగా వ్యవహరించడం సరైంది కాదని...ఓదిగే విషయంలో బాలయ్య ని చూసి బోయపాటి చాలా అర్జెంట్ గా  నేర్చుకోవాలి అనేది ఇండస్ట్రీలో కొంతమంది అంటున్నారు. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో రాబోతున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని బాలయ్య అభిమానులు కోరుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: