ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు గత సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. అధికారంలో ఉన్న వైయస్సార్సీపి మరియు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు నువ్వానేనా అన్నట్టుగా  హోరాహోరీగా పోరాడుతున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పై రాష్ట్రంలో ఎక్కువగా పాజిటివ్ వాతావరణం ఉండటంతో చాలావరకు ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీ విక్టరీ వెంకటేష్ వైకాపా కోసం ప్రచారం చేయడానికి దిగటంతో ఈ వార్త సెన్సేషనల్ న్యూస్ అయ్యింది సోషల్ మీడియాలో. ఫుల్ మేటర్ లోకి వెళ్తే విక్టరీ వెంకటేష్ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగారు. అది కూడా అధికార పార్టీ వైసీపీ తరఫున ఆమె జడ్పీటీసీగా బరిలోకి దిగారు. ఓ స్టార్ హీరో సోదరి అది కూడా అధికార పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారంటే ఆసక్తికరమే కదా.

 

ఈ ఆసక్తికర వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... వెంకటేశ్ సోదరి తాళ్లూరు స్వరూపరాణి ప్రస్తుతం ఏపీలోని నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ సొంత సోదరి కాకపోయినా గానీ దగ్గర బంధువు కావడంతో కజిన్ కావటంతో  ఎక్కువగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చూపించని దగ్గుబాటి కుటుంబం తాజాగా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి రామానాయుడు సోదరుడు కుమార్తె కావడంతో స్వరూపరాణి ఎన్నికల ప్రచారంలో కి వెళ్తున్న ఈ నేపథ్యంలో ఆమెకు అండగా నిలవడానికి విక్టరీ వెంకటేష్ కూడా వైసిపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

ముఖ్యంగా స్వరూప రాణి భర్త తరఫు వారు ఓ మోస్తరుగా రాజకీయాల్లో ఉండటంతో నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ నాయకులు వెంకటేష్ ప్రచారానికి భారీగా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ సొంత నిర్మాణ ప్రొడక్షన్ లో నారప్ప అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇటువంటి తరుణంలో జగన్ పార్టీ తరపున వెంకటేష్ ప్రచారం చేస్తున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఇది అరాచకమైన న్యూస్ అంటూ దగ్గుబాటి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: