కన్నడ బ్యూటి రష్మిక మందన్న ది రోజుకో హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉంది ఇద్దరే. ఆ ఇద్దరిలో ఒకరు పూజా హెగ్డే కాగా ఇంకొకరు ఈ కన్నడ బ్యూటి కావడం విశేషం. కుర్ర హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మరో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమా లో నటించింది. ఆ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో రష్మిక స్టార్ తిరిగిపోయింది. 

 

ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ అందుకుంది. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాతో పోటీ పడిన ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే అల సినిమాని బీట్ చేయలేకపోయింది. అన్ని రకాల కంపేరిజన్స్ బాగా పెట్టారు. వాటిలో మ్యూజిక్ తో పాటు హీరోయిన్ విషయం కూడా జనాలు కంపేర్ చేశారు. 

 

అల సినిమాకి పూజా హెగ్డే చాలా ప్లస్ అయిందని అదే సరిలేరు సినిమాకి మాత్రం రష్మిక అసలు సెట్ అవలేదని అన్నారు. సినిమాలో సూపర్ స్టార్ పక్కన మరి కామెడీగా ఉందని హీరోయిన్ లా ఎంతమాత్రం సూటవలేదని కామెంట్స్ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో ఉన్న మైనస్ లలో మేజర్ మైనస్ హీరోయిన్ రష్మిక నే అని అందరూ నిందలు వేశారు. దాంతో ఈ ఎఫెక్ట్ రష్మిక మీద చాలా పడింది. దానికి తోడు పోటీ గా పూజా హెగ్డే భయంకరంగా పోటీ ఇస్తుంది. అందుకే రష్మిక కి ప్రస్తుతం ఒక్క సినిమానే చేతిలో ఉంది.

 

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కితున్న ఈ ఒక్క సినిమా తప్ప ఇక తెలుగులో మరో సినిమా లేదు. ఒక ఈ ఫ్రష్టేషన్ ఒకటైతే మరో పక్క సరిలేరు కామెంట్స్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. దాంతో రష్మిక తన సన్నిహితుల దగ్గర ప్రాజెక్ట్ కి ఒకే అన్న దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు నన్ను అన్ని రకాలుగా వాడుకున్నారు. ఇప్పుడేమో సినిమాకి నేనే మైనస్ అని ఎలా అంటారు. ఇంత దారుణంగా ఎలా కామెంట్స్ చేస్తారని వాపోతుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: