ప్రస్తుతం ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది దీని వల్ల చాలా వరకు విదేశీ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఇండియా లో కూడా కరోనా టెంక్షన్ ఎక్కువాగానే వుంది దాంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏప్రిల్ 15వరకు వీసాల జారీ విషయంలో ఆంక్షలు  విధించింది అలాగే తెలంగాణ లో థియేటర్లు, విద్యాసంస్థలపైఈనెల 31వరకు నిషేధం విధించారు. ఇక ఇదిలావుంటే ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి మాత్రం  కరోనా ను లెక్కచేయకుండా షెడ్యూల్ ప్రకారం జార్జియా వెళ్ళి షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
 
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే..  ఈ సినిమా షూటింగ్ కొద్దీ రోజులనుండి జార్జియా  లో జరుగుతుంది. హీరో తోపాటు హీరోయిన్ పూజా హేగ్డే  కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. తాజాగా ప్రియదర్శి ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.  లవ్ స్టోరీ నేపథ్యం లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఉగాది కానుకగా మార్చి 25న  ఈ సినిమాటైటిల్ తోపాటు రెండు ఫస్ట్ లుక్ లు విడుదలకానున్నాయని వార్తలు వస్తున్నాయి.  గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రానికి సైరా ఫేమ్  అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతోపాటు తమిళ ,హిందీ భాషల్లో విడుదలకానుంది.
 
ఇక ఈ చిత్రం తరువాత ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 21వ చిత్రం లో నటించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో  వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: