రెండేళ్ళ గ్యాప్ తర్వాత పింక్ చిత్రం రీమేక్తో తెర ముందు కొస్తున్నాడు పవర్స్టార్ పవన్కళ్యాన్. ఓ వైపు రాజకియాలు మరో వైపు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పవన్ చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి. ఇక ఈ చిత్ర పోస్టర్ ఇటీవలె విడుదలై మంచి రెస్పాన్స్ని తెచ్చుకుంది. ఈ చిత్రమే కాక పవన్ మరో రెండు మూడు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి హరీష్శంకర్తో, మరొకటి క్రిష్తో, ఈ మధ్యనే క్రేజీ డైరెక్టర్ పూరిజగన్నాధ్తో కూడా చిత్రం చేయడానికి అయన రెఢీ అయ్యారు. ఇక పూరి చిత్రంతో పవన్ కళ్యాణ్ కెరియర్ ఒక దారిలో పడింది అని చెప్పాలి. అప్పటి వరకు నటించిన చిత్రాలు ఒక ఎత్తు అయితే పూరి దర్శకత్వంలో వచ్చిన బద్రి చిత్రం పవన్ కెరియర్లో బిగ్గుస్ట్ హిట్ అని చెప్పాలి.
ఆ తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన గంగతో రాంబాబు పెద్దగా హిట్ అనిపించుకోలేదు. మరి ఈ సారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం గతంలో మహేష్తో జనగణమన అనే చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కథనే పూరి పవన్ కి చెప్పినట్లు సమాచారం. అందులో కథానాయకుడు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడట. మరి ఇప్పటికే మూడు సినిమాలు అధికారికంగా క్లారిటీలో ఉన్న పవన్ ఈ ముఖ్యమంత్రి పాత్రకి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలి.
పూరితో ఇదివరకే రెండు సినిమాలు చేసిన పవన్ కు ఇది మూడోది. రీఎంట్రీలో వరుసగా వేగంగా సినిమాలు తీస్తున్న పవన్ తాజాగా పూరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం అని చెప్పాలి. ఇక నిజజీవితంలో ముఖ్యమంత్రి కాలేని పవర్ స్టార్ ని తన సినిమా ద్వారా సీఎం చేస్తానని.. ఆ కోరికను తీరుస్తానని అంటున్నాడట పూరి. అవును పూరి తాజాగా పవన్ తో తీసే సినిమాలో సీఎం అయ్యే కథనాయకుడి పాత్రనే పవన్ కోసం తీర్చిదిద్దాడట. మరి పవన్ ఇలా తన కోరికను తీర్చుకుంటున్నాడా అని కొందరు అంటున్నారు. ఇక ఈ వారం పవన్ ప్రోగ్రెస్ ఇదే.