పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి ఫేమస్ అయిన వారిలో శ్రీ రెడ్డి, కత్తి మహేష్ టాప్ ప్లేస్లలో ఉంటారు. పవన్ కళ్యాణ్ ని తిట్టకుండా ఒక్క వారం కూడా ఉండలేరు వీళ్ళు. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని ప్రారంభించిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ సాయం కోరితే తాను పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని చెప్పడంతో... అతడి అమ్మని అనకూడని మాట అనేసింది. దాంతో మెగా ఫ్యామిలీ తో పాటు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారమే రేగింది. అయినా నాగబాబు మాట్లాడాడు కానీ శ్రీ రెడ్డిని మాత్రం తిరిగి తిట్టలేదు. పవన్ కళ్యాణ్ అసలే పట్టించుకోలేదు.




ఇక అప్పటి నుంచి శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ప్రతి విషయంలో టార్గెట్ చేస్తూనే ఉంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాడివి నీకు ఎందుకురా రాజకీయం? అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కోకొల్లలు. అయినా పవర్ స్టార్ మాత్రం వీటన్నింటిపై ఎన్నడూ పెదవి విప్పలేదు. వాళ్ల పాపాన వాళ్ళే పోతారు మేము బలవంతులం భరించేవాళ్ళం అంటూ కాలయాపన చేశారు. కాని ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... కొందరు తన తల్లిపై చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడారని... అలా మాట్లాడితే తన కడుపు మనకుండా ఉంటుందా? అని సీరియస్ గా ప్రశ్నించారు.



తను ఇంకా మాట్లాడుతూ... 'ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోగల శక్తి వచ్చింది కాబట్టే పొలిటికల్ పార్టీ ని పెట్టగలిగాను. అలాగే ఈ సమాజం మొత్తం నా కుటుంబం లాగానే భావించాను కాబట్టే ఒకరు తిట్టినా, మరొక తిట్టించినా భరించాను. అదే పాత పవన్ కళ్యాణ్ అయ్యుంటేనా ఈ పాటకి నన్ను విమర్శించే వాళ్ల( శ్రీ రెడ్డి) తాట తీసే వాడిని', అంటూ విపరీతమైన ఆగ్రహం తో మాట్లాడాడు. సమాజం తన కుటుంబమని భావించానని అందుకే ఎవరు ఏమి చేసినా ఏమి తిట్టినా భరిస్తానని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఏదో ఒక రోజున టైం వస్తుందని అప్పుడు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయడంలో తాను మునిగిపోతానని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: