టాలీవుడ్ సీనియర్
హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇప్పటివరకు తన కెరీర్ లో మొత్తం 350 కి పైగా సినిమాల్లో నటించారు. ముందుగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన తేనెమనసులు సినిమాతో
టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన
కృష్ణ, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక ఆ తరువాత నుండి హీరోగా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకున్న
కృష్ణ, ఆపై ఎన్నో గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించడంతో పాటు ఎందరో ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నారు.
ఆయన సాంఘికం, పౌరాణికం, జానపదం, చరిత్రాత్మకం, కౌబాయ్,
జేమ్స్ బాండ్ సహా అన్ని రకాల జానర్ల సినిమాల్లో
కృష్ణ నటించారు. అయితే తన కెరీర్ లో ఎన్నో గొప్ప సాహసాలు చేసిన
కృష్ణ, తన 200వ సినిమాగా వచ్చిన ఈనాడు విషయమై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట. విషయం ఏమిటంటే, అప్పటికే అతి పెద్ద
మాస్ హీరోగా ఎంతో గొప్ప స్టార్డం తో కొనసాగుతున్న
కృష్ణ, 200వ
సినిమా విషయమై కొంత డేరింగ్ స్టెప్ వేశారని ఇటీవల పరుచూరి సోదరుల్లో ఒకరైన
పరుచూరి గోపాలకృష్ణ ఒక
మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించడం జరిగింది.
ప్రతిష్టాత్మక 200వ
సినిమా కావడంతో ఏదైనా మంచి కమర్షియల్
సినిమా చేద్దాం అని
కృష్ణ కి తాము చెప్పినపుడు ఆయన దానికి అంగీకరించకుండా, ఈనాడు వంటి మంచి మెసేజ్
సినిమా ఎంచుకున్నారని, అందులో
హీరో పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ, అది పక్కా మెసేజ్
సినిమా అని, అలానే అందులో ఆయనకు
హీరోయిన్ కూడా ఉండదని తెలిసినప్పటికీ, తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తారని
కృష్ణ, ఈనాడు
సినిమా చేయడం జరిగిందట. అయితే రిలీజ్ తరువాత ఆయన చెప్పిన విధంగానే ఈనాడు సూపర్ హిట్
కోటి కృష్ణ గారి నమ్మకాన్ని నిజం చేసిందని, ఆ విధంగా
టాలీవుడ్ లో అటువంటి డేరింగ్, డ్యాషింగ్ స్టెప్స్ వేయడంలో
కృష్ణ గారు, ఆయనకు ఆయనే సాటి అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు...... !!