ముందుగా తరుణ్ హీరోగా వచ్చిన నీ మనసు నాకు తెలుసు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన కోలీవుడ్ భామ త్రిష కృష్ణన్, ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. అయితే అదే సమయంలో ఆమెకు వర్షం, నువ్వు వస్థానంటే నేనొద్దంటానా సినిమాలు మంచి పెరు తెచ్చిపెట్టాయి.
 
ఇక ఆపై ఆమె అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన కూడా వరుసగా ఛాన్స్ లు అందుకుంది. అయితే ఆ సమయంలో ఆమెకు కొన్ని హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా వచ్చాయి. ఇక ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం త్రిష కు ఒకింత అవకాశాలు తగ్గాయి అనే చెప్పాలి. ఇక ఇటీవల మోహిని, నాయకి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినప్పటికీ అవి ఆమెకు పెద్దగా సక్సెస్ ని అయితే అందివ్వలేదు.
 
ఇకపోతే కొద్దిరోజుల క్రితం మెగాస్టార్, కొరటాల కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన త్రిష, మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, రెండు రోజుల క్రితం కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా ఆ సినిమా నుండి అర్ధాంతరంగా తప్పుకుంటున్నాను, ఒక్కోసారి మనం అనుకున్నవన్ని జరగవు కదా అంటూ ఆమె తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ లో త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని, కాగా దాని కోసమే మెగాస్టార్ మూవీ నుండి అర్ధాంతరంగా ఆమె బయటకు రావడం జరిగిందని ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. మరి ప్రస్తుతం ప్రచారం ఆవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం త్రిషనే స్పందించాలని అంటున్నారు సినీ విశ్లేషకులు...... !!
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: